ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వం, హైకోర్టు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్నది. రాష్ట్రంలోని హైకోర్టును, మిగతా కార్యాలయాలను అమరావతి నుంచి తరలించేందుకు సర్కార్ సిద్ధం అయ్యిం సంగతి తెలిసిందే. అమరావతి నుంచి ఇప్పటికే విజిలెన్స్, జీఏడీ కార్యాలయాలను తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని గతంలో కర్నూల్ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. కర్నూలులో తగిన భవనాలు చూడాలని ప్రభుత్వం ఆదేశించింది.
అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు దాఖలు చేశారు. కార్యాలయాలు హైదరాబాద్ లోనే ఉండాలని, మార్చేందుకు వీలులేదని చెప్తూ కేసులు ఫైల్ అయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వివరణ కోరింది. అమరావతి సచివాలయంలో ప్లేస్ లేనందువలన ఆఫీస్ లను అమరావతి నుంచి కర్నూలుకు మారుస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది.
స్థలం లేకపోవడం వలనే కార్యాలయాలు మారుస్తున్నట్టు చెప్తూ వస్తున్నా, దాని వెనుక కారణం వేరే ఉన్న సంగతి అందరికి తెలిసిందే. స్థలం లేకుంటే అమరావతిలోని మరోచోట ఏర్పాటు చేయాలిగాని, మరో ప్రాంతానికి ఎలా మారుస్తారని కోర్టు ప్రశ్నిస్తోంది. దీనిపై విచారణ జరిగే అవకాశం ఉన్నది. ప్రభుత్వం మాత్రం కార్యాలయాలు అక్కడి నుంచి కర్నూలుకు మార్చేందుకు ఫైనల్ గా సిద్ధం అయ్యింది. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుంది. ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది తెలియాల్సి ఉన్నది.
361874 885120Thankyou for all your efforts which you have put in this. quite intriguing information . 1479
355127 335500I likewise conceive thus, perfectly written post! . 173869