ధనిక రాష్ట్రం తెలంగాణ, ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కానీ, పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం, ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. కష్ట కాలంలో, మరింత ఉత్సాహంగా పనిచేస్తోన్న ఉద్యోగులకు ఏమాత్రం జీతాల్లో కోత విధించకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, జీతం మొత్తం ఒకే దఫాలో కాకుండా, రెండు దఫాల్లో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందట. ఈ విషయమై ముఖ్యమంత్రి నుంచి తమకు సమాచారం అందిందని ఏపీ ఉద్యోగులు చెబుతున్నారు.
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచం విలవిల్లాడుతోంది. లాక్డౌన్ కారణంగా, ప్రభుత్వాలకు ఆదాయం పడిపోయింది. మద్యం అమ్మకాల్లేవు.. పెట్రోలు – డీజిల్ అమ్మకాల్లేవు.. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానా పరిస్థితేంటి.? అసలే, నిండా అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్రం. విభజన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రం. సాధారణ పరిస్థితుల్లోనే ఉద్యోగులకు జీతాల కోసం ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోంటోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా వున్నా, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనకి హేట్సాఫ్ చెప్పాల్సిందే.
నిజానికి, కొన్ని రాష్ట్రాలు ఉద్యోగులకు.. అందునా, వైద్య రంగం సహా పలు కీలక రంగాల్లోని ఉద్యోగులకు అదనపు వేతనాలు చెల్లించేందుకు ముందుకొస్తున్నాయి. అయితే, తమ తమ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ బాటలో నడుస్తూ, ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తున్న ప్రభుత్వాలూ లేకపోలేదు. మిగతా రాష్ట్రాల సంగతెలా వున్నా, తెలంగాణలో జీతాల కోతపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన వెంటనే ఆందోళనకు గురైన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు, వైఎస్ జగన్ ప్రభుత్వం ఊరటనివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమే.
903513 537681Some truly good and utilitarian info on this internet internet site , besides I think the layout holds wonderful capabilities. 841812
534261 584403Keep up the wonderful piece of function, I read few posts on this internet site and I feel that your weblog is genuinely fascinating and holds bands of fantastic info. 110256