గణతంత్ర వేడుకల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుంది. ఈసారికి విజయవాడలోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 26న విశాఖలోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాస్తవానికి రెండు వారాల క్రితమే దీనిపై నిర్ణయం తీసుకున్న సర్కారు.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే, తాజాగా ఈ విషయంలో మనసు మార్చుకుంది. ఈసారికి విజయవాడలోనే వీటిని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించింది. వ్యూహాత్మకంగా వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.
రాజధాని తరలింపు నేపథ్యంలో అమరావతిలో నెల రోజులుగా ఆందోళనలు సాగుతున్న సంగతి తెలిసిందే. వాటిని పరిష్కరించే దిశగా సర్కారు సరైన చర్యలు చేపట్టలేదు. రోజురోజుకూ ఆ ఆందోళనలు ఉధృతం కావడంతో అక్కడి ప్రజల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని పోగొట్టాలని అధికార పార్టీ నిర్ణయించింది. తాము రాజధానిని తరలించడంలేదని, ఇతర ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నామని, లెజిస్లేటివ్ కేపిటల్ గా అమరావతి ఉంటుందని సోమవారం సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు.
అయితే, మీడియాలో అమరావతి తరలింపు అంటూ గత నెలరోజులుగా అదేపనిగా వార్తలు వస్తుండటంతో వాటికి చెక్ పెట్టాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలాగే ఈసారి గణతంత్ర వేడుకలను విజయవాడలోనే నిర్వహించడం ద్వారా ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గణతంత్ర వేడుకల వేదికను విశాఖ నుంచి విజయవాడకు మార్చింది.
294678 409179This really is a terrific web site, could you be interested in performing an interview about just how you developed it? If so e-mail me! 691303
708289 246470Numerous thanks I ought say, impressed with your web site. I will post this to my facebook wall. 143147