ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకునే నిర్ణయాలు, పాలన ఎలా ఉన్నా ప్రతిపక్షం నుంచి మాత్రం నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నది. జగన్ కు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి సరిపోయింది లేదంటే మాత్రం ఆ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిపోయేది. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా ఉన్నాయి.
ఇక ఇదిలా ఉంటె, ఏపీ ప్రభుత్వం మార్చి నెలలో అనేక గండాలను ఎదుర్కొనబోతున్నది. వీటిని ఎదుర్కొని నిలబడాలి అంటే మామూలు విషయం కాదు. చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. మార్చి నెలలో ఇంటర్, పదోతరగతి పరీక్షలను నిర్వహించాల్సి ఉన్నది. ఈ నెలాఖరు లోగా పంచాయితీ, పురపాలక ఎన్నికలు పూర్తి చేయాలి. ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఇదే నెలలో ప్రభుత్వం పేదల కోసం ఇళ్లస్థలాలు ఇవ్వాల్సి ఉన్నది.
వీటన్నింటిని ప్రభుత్వం అధికమించాలి. ముఖ్యంగా పంచాయితీ, పురపాలక ఎన్నికలను నెలాఖరులోగా ఎట్టి పరిస్థితిల్లో కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే, మార్చి 31 దాటితే 14 వ ఆర్ధిక సంఘం నుంచి అందాల్సిన నిధులు ఆగిపోతాయి. ఈలోగానే ఎన్నికలు పూర్తి చేయాలి. ఈ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించిన కేసు హైకౌరుట్లో ఉన్నది. కోర్ట్ తీర్పు రావాల్సి ఉన్నది. ఒకవేళ తీర్పు అనుకూలంగా వచ్చినా రాకున్నా ఎన్నికలను మాత్రం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికలు నిర్వహిస్తే దానికి సిబ్బంది కావాలి.
మార్చి నెలలో పరీక్షలు ఉన్నాయి కాబట్టి టీచర్లు ఇన్విజిలేటర్లుగా వెళ్తారు. ఎన్నికలకు అందుబాటులో ఉండకపోవచ్చు. వీరి స్థానంలో గ్రామ వాలంటీర్లను వినియోగించుకునే అవకాశం ఉన్నది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలి. ఈ తతంగం మొత్తం ఈనెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మార్చి నెలలో ప్రభుత్వం ఇన్ని అడ్డంకులు దాటుకొని ముందుకు ఎలా వెళ్తుంది అన్నది అందరి ముందున్న ప్రశ్న. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.
7771 160160Hello! I basically want to make a enormous thumbs up with the wonderful info youve here during this post. We are returning to your blog for additional soon. 104968
789725 383800I genuinely prize your piece of work, Wonderful post. 823012