13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై ఆంక్షలు? ఏపీలో చట్టం దిశగా అడుగులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,608FansLike
57,764FollowersFollow

పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యల దిశగా అడుగులు వేస్తోంది. 13 సంవత్సరాల లోపు బాలలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా విధివిధానాలు రూపొందించి, ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో మంత్రుల బృందం, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ప్రతినిధులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు వయస్సు ఆధారిత కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా ప్రత్యేక విధానాలు రూపొందించాలని సూచించారు. చిన్నారుల్లో సృజనాత్మకత, మానసిక ఆరోగ్యం, చదువుపై ప్రతికూల ప్రభావం పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలపై అవమానకరమైన, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై ఆంక్షలు? ఏపీలో చట్టం దిశగా అడుగులు

పిల్లల డిజిటల్ భద్రత, సున్నితమైన కంటెంట్ నియంత్రణ, చట్టపరమైన వ్యవస్థల విషయంలో ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్ వంటి దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. వయస్సు నిర్ధారణ కోసం డిజిలాకర్‌తో అనుసంధానమైన ఏజ్ టోకెన్ల వినియోగంపై కూడా పరిశీలన జరపాలని తెలిపారు. ప్రజాభిప్రాయం సేకరించిన అనంతరం కేంద్ర చట్ట పరిధిలోకి వచ్చే అంశాలపై సమగ్ర నివేదికను అందజేస్తామని చెప్పారు.

సోషల్ మీడియా ప్రభావంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’, ప్రతి ఏడాది రెండుసార్లు జరిగే మెగా పీటీఏ సమావేశాలు, అలాగే స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా కూడా ఈ అవగాహనను విస్తరించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో, ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలు, సున్నితమైన కంటెంట్ నియంత్రణకు అమలు చేస్తున్న విధానాలను వివిధ సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు మంత్రుల బృందానికి వివరించారు.

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై ఆంక్షలు? ఏపీలో చట్టం దిశగా అడుగులు

ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఐ & పీఆర్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, ఐజీ ఈగల్ మరియు సైబర్ క్రైమ్ ఇన్‌చార్జ్ ఆకే రవికృష్ణ, సైబర్ క్రైమ్ ఎస్పీ అదిరాజ్ సింగ్ రానా, ఐ & పీఆర్ జాయింట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, డిజిటల్ కార్పొరేషన్ చీఫ్ జనరల్ మేనేజర్ పి. జయరావు, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఒ. మధుసూదనరావు, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ రామకోటేశ్వరరావు హాజరయ్యారు. సోషల్ మీడియా సంస్థల నుంచి మెటా డైరెక్టర్ నటాషా జోగ్, యూట్యూబ్ పబ్లిక్ పాలసీ మేనేజర్ మీరా స్వామినాథన్, ఎక్స్ పబ్లిక్ పాలసీ ప్రొఫెషనల్ జప్రీత్ గ్రెవల్, షేర్‌చాట్ పాలసీ హెడ్ తమోగా గోస్వామి, జోష్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి రామానుజన్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై ఆంక్షలు? ఏపీలో చట్టం దిశగా అడుగులు

పిల్లల ఆన్‌లైన్ భద్రత, మహిళల గౌరవం, బాధ్యతాయుతమైన డిజిటల్ వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంబించబోతుందనే సంకేతాలు ఈ సమావేశం ద్వారా స్పష్టమయ్యాయి.

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై ఆంక్షలు? ఏపీలో చట్టం దిశగా అడుగులు

సినిమా

చిరంజీవి జిమ్ వీడియోతో పెరిగిన #ChiruBobby2 హైప్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలపడంతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం #ChiruBobby2, #Chiru158 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ...

Jr.Ntr Birthday Special: ‘జూ.ఎన్టీఆర్’ కి మాత్రమే దక్కిన క్రేజ్.. సాధించిన...

Jr.Ntr Birthday Special: స్టూడెంట్ నెం.1, ఆది వరుస హిట్లతో ఎన్టీఆర్ పేరు రాష్ట్రంలో మోగిపోయింది. కానీ, ఆ విధ్వంసం అక్కడితో ఆగలేదు. 2003లో వచ్చిన...

Trisha: రూ.12కోట్ల భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన త్రిష..! కారణం అదేనా..!?

Trisha: తెలుగు, తమిళ భాషల్లో రెండు దశాబ్దాలకు పైగా తన అందం, నటనతో సినీరంగంలో రాణిస్తున్నారు త్రిష. ఓదశలో సౌత్ ఇండస్ట్రీ నెంబర్ వన్ గానూ...

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే...

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన...

రాజకీయం

చట్టం ముందు అందరూ సమానమే.. బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తన కుమారుడు బండి భగీరథ్‌పై కొనసాగుతున్న వ్యవహారంపై స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతో తన కుమారుడు న్యాయవాదుల ద్వారా...

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

ఎక్కువ చదివినవి

“ఇది ఎగ్జిబిటర్ల బ్రతుకు పోరాటం”.. పర్సెంటేజ్ షేరింగ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక డిమాండ్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, పరిరక్షణ కోసం “పర్సెంటేజ్ షేరింగ్ విధానం”ను అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మరోసారి గట్టిగా డిమాండ్ చేసింది. ఈ అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ...

కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు ‘పెద్ది’పై పాజిటివ్‌గా మాట్లాడటం ఇండస్ట్రీలో ఆసక్తికర...

ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చేది ఏఎంసీఏ ప్రాజెక్టే: నారా లోకేష్

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రనే మార్చబోతుందని మంత్రి Nara Lokesh అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు దూరమవడం, ఓటీటీ ప్రభావం, హీరోల సినిమా...

పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చర్చించారు.?

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఇటీవల సైనస్ సమస్య నేపథ్యంలో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నప్పటినుంచీ వున్న సమస్యే అయినా,...