AP Government: పది రోజులుగా ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయా..? వైసీపీ నేతల అరెస్టుతో రాజీకీయాలు మారుతున్నాయా..? మరింత మంది పేర్లు చట్టం లిస్టులో చేరబోతున్నాయా..? గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష టీడీపీ నేతలపై తిట్ల వర్షం కురిపించిన నేతల గుండెల్లో గుబులు మొదలైందా..? నాటి ప్రభుత్వ హయాంలో పెద్దల అండతో రెచ్చిపోయిన అధికారుల్లో కూడా వణుకు మొదలవుతోందా..? మొత్తంగా మంత్రి లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అవుతోందా..?? మొన్న వల్లభనేని, నిన్న పోసాని అరెస్టు.. నేడు సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్ తో కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచిందా..??? ప్రస్తుత పరిస్థితులు ఔననే సమాధానం ఇస్తున్నాయి.
అధికారంలో ఉన్నామనే ధైర్యంతో నోరుపారేసుకున్న వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి.. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే అభియోగాలు నిర్ధారణ కావడంతో సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్.. అటు రాజకీయ నేతలు, ఇటు అధికారులు పూర్తిగా ఇరకాటంలో పడ్డారు. సునీల్ కుమార్ అప్పట్లో యూఏఈ పర్యటనకు వెళ్లొస్తానని అనుమతలు తీసుకుని, తర్వాత ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వివిధ దేశాలలో పర్యటించారు. ఇది ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడమే కావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వల్లభనేని, పోసాని నోరుపారేసుకున్న తీరు, వారి మాటలు అందరికీ తెలిసిందే. అవి రాసుకుంటూ పోతే మరో బుక్ అవుతుందనేది నిజం. అయితే.. సునీల్ కుమార్ సస్పెన్షన్ కు కారణాలను పరిశీలిస్తే..
- 2024 ఫిబ్రవరి.. జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని.. దుబాయ్ లో పర్యటించారు సునీల్ కుమార్.
- 2023 సెప్టెంబర్ 2.. ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం EK 525 లో హైదరాబాద్ నుంచి స్వీడన్ వెళ్లి.. 2023 సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానం EK 526లో హైదరాబాద్ తిరిగివచ్చారు.
- 2023 ఫిబ్రవరి 1.. హైదరాబాద్ నుండి EK 525 విమానం లో దుబాయి మీదగా అమెరికా వెళ్లి 2023 ఫిబ్రవరి 28న EK 524 విమానంలో అమెరికా నుండి దుబాయ్ మీదుగా హైదరాబాద్ తిరిగొచ్చారు.
- డిసెంబర్ 14’ 2022.. నుంచి జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని డిసెంబర్ 19, 2022 వరకు దుబాయిలో పర్యటించారు.
- 2021 అక్టోబర్ 2.. EK525 విమానంలో హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లి 10,అక్టోబర్ న EK524 విమానంలో హైదరాబాద్ వచ్చారు.
- 21 డిసెంబర్ 2019.. నుంచి 4 జనవరి 2020 వరకు అమెరికాలో పర్యటనకు అనుమతి తీసుకుని యూకేలో పర్యటించారు.
పైన పేర్కొన్న అంశాల్లో అనుమతులు తీసుకోనివి.. ఒకచోటికి అనుమతి తీసుకుని వేరుచోటికి వెళ్లారు సునీల్ కుమార్. ఇవన్నీ ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘించినవే కావడం.. అవి రుజువు కావడంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కాకుండా.. ఇటీవల ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి వ్యతిరేంగా మాల సామాజిక వర్గం నేతలు ఒంగోలులో నిర్వహించిన సభకు సునీల్ కుమార్ హాజరై సభలో ప్రసంగించారు సునీల్ కుమార్. ఎస్సీ విభజనకు ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే, దానిపై పోరాటం చేయాలని.. శాసనసభను ముట్టడించాలని సూచించారు. దీనిపైనా ప్రభుత్వం త్వరలో విచారణ జరుపనుందని తెలుస్తోంది.
