AP Government: పేదలకు అందించే బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ ఉప సంఘంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో వ్యవహారాలపై చర్చించారు. వేర్ హౌసుల్లో యంత్రాలు ఎలా ఏర్పాటు చేశారని మారిటైమ్ బోర్డు, కాకినాడ పోర్టు అధికారులను మంత్రులు ప్రశ్నించారు. ముఖ్యమైన శాఖల అధికారులు పాల్గొనగా ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది.
- కాకినాడ పోర్టులో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం.
- పోర్టు భద్రత కోసం ఛీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నియామకం.
- పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు.
- పోర్టు, పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపై నిఘా బలోపేతం.
- యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలకు నిర్ణయం.
- పోర్టులోని 5వేర్ హౌసుల్లో సార్టెక్స్ మిషన్లు ఉండటంపై చర్చ.
- సార్టెక్స్ యంత్రాలను ఏర్పాటుపై విచారణ, బాధ్యులైనవారిపై కఠిన చర్యలకు ఆదేశం.