గోదావరి కోసం పవన్ స్పెషల్ ప్లాన్.. నదుల కాలుష్యంపై టాస్క్ ఫోర్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,284FansLike
57,764FollowersFollow

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ అత్యున్నత స్థాయి ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

రాజమహేంద్రవరంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనల ఆధారంగా పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే అధికారికంగా జీవో విడుదల చేశారు. గోదావరి నదితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదుల్లోకి చేరుతున్న మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.

ఇటీవల రెండు రోజుల పాటు రాజమహేంద్రవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ స్వయంగా పడవలో ప్రయాణించి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలు, నగర మురుగునీరు నేరుగా గోదావరిలో కలుస్తుండటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు పవిత్రమైన గోదావరిలో స్వచ్ఛమైన జలాల్లో స్నానం చేస్తున్న అనుభూతి కలగాలని, కాలుష్య సమస్యపై రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు.

ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌కు పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ కన్వీనర్‌గా ఉంటారు. వివిధ శాఖల కమిషనర్లు, ఇంజినీర్లు, గోదావరి పరివాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై గోదావరితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో కాలుష్య మూలాలను గుర్తించనుంది. కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు తక్షణ చర్యలు చేపట్టి పనుల పురోగతిని సమీక్షించనుంది. గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు స్వచ్ఛమైన నదీ జలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు వెల్లడించారు.

సినిమా

నా వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తే కోర్టులో సమాధానం చెప్పాల్సిందే: చిన్మయి హెచ్చరిక

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ఓ నెటిజన్‌కు ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, సంతానోత్పత్తి...

Jana Nayagan: ‘జననాయగన్’ వచ్చేస్తోంది..! విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారా..?

Jana Nayagan: తమిళనాడు సీఎం విజయ్ నటించిన‌ చివరి సినిమా 'జన నాయగన్’. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన సినిమాపై ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...

12 గంటల యాక్షన్ షూట్‌లో చిరంజీవి.. మెగా స్టార్ డెడికేషన్‌కు టీమ్...

మెగాస్టార్ చిరంజీవి తన అంకితభావం, క్రమశిక్షణతో మరోసారి అభిమానులతో పాటు చిత్రబృందాన్ని కూడా ఆకట్టుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న #MEGA158 సినిమా షూటింగ్‌లో అత్యంత క్లిష్టమైన...

ప్రేయసిపైనే కోర్టులో కేసు.. ‘ఒక కోర్టు కేస్’

ప్రేమలో మోసం, బ్రేకప్, ప్రతీకారం వంటి అంశాలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినా, ప్రేమలో జరిగిన అన్యాయానికి న్యాయం కోసం తన ప్రేయసిపైనే కోర్టులో కేసు...

Akkineni Akhil: ‘లెనిన్’కు స్టార్ హీరోల సెంటిమెంట్..! వర్కౌట్ అయితే తిరుగులేనట్టే..!

Akkineni Akhil: అక్కినేని.. టాలీవుడ్ లో ఈ ఇంటి పేరు ఓ బ్రాండ్. హీరోలుగా అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా పిల్లర్ అయితే. ఆయన వారసుడిగా...

రాజకీయం

గుట్టుపల్లి రైతులకు గుడ్ న్యూస్.. 22ఏ జాబితా నుంచి 2,074 ఎకరాల విముక్తి

బేతంచెర్ల మండలం గుట్టుపల్లి రైతులకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించింది. గతంలో వక్ఫ్ ఆస్తులుగా పొరపాటున 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన 2,074 ఎకరాల పట్టా భూములను తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం...

కొరియాతో లోకేష్ కీలక చర్చలు.. ఏపీకి నాలెడ్జ్ ఎకానమీ లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, కొరియా...

కియాకు లోకేష్ ఆహ్వానం.. ఏపీలో ఈవీ హబ్ ఏర్పాటు చేయండి

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో సియోల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో...

పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాల్సిందే.! సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని నిలబడి నేరం చేశాడు మరి.!

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీ దేవి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు...

హస్తకళాకారులకు పవన్ హామీ అమలు.. ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారులకు ఆరోగ్య భరోసా కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా...

ఎక్కువ చదివినవి

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు ప్లాన్

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో...

‘లెనిన్’కు థమన్ ఫినిషింగ్ టచ్.. నేటి నుంచి థమన్ ప్రమోషన్ రౌండ్!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ సంగీత పనులను సంగీత దర్శకుడు ఎస్. థమన్ పూర్తి చేసినట్లు సమాచారం. ముఖ్యంగా...

Daily Horoscope: సింహం వారికి గుర్తింపు.. మీనం వారికి శుభవార్త

జులై 9, 2026 గురువారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా ఈరోజు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్త అవసరమని సూచిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం,...

ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగినా.. జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకలేదా?

కాకినాడ జిల్లా తునికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి నెల రోజులు పూర్తయ్యాయి. గత నెల 6వ తేదీన ఇంటి సమీపంలో తండ్రి కోసం వెతుకుతూ వెళ్లిన చిన్నారి అప్పటి...

అల్లూరి, పింగళి, రోశయ్యకు లోకేష్ ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం మూడు ప్రముఖ తెలుగు మహనీయులను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, భారత...