Switch to English

Piracy: ఏపీ కుర్రాడి అద్భుతం.. సినిమా పైరసీకి చెక్.. నూతన టెక్నాలజీ ఆవిష్కరణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,840FansLike
57,764FollowersFollow

Piracy: సినీ పరిశ్రమను పెనుభూతంలా పట్టి పీడిస్తున్న అంశం ‘పైరసీ’. ఎటువంటి పద్ధతుల్ని అవలంబించినా మోసగాళ్లు వేరే దారులు వెతుక్కుని మరీ సినిమాల్ని ఆన్ లైన్లో పెట్టేస్తున్నారు. దీంతో కోట్లు ఖర్చు చేసి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలకు, సినిమాలను కొనుక్కున్న వారికి నష్టాలు తప్పడంలేదు. అయితే.. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లికి చెందిన యువ ఇంజినీర్ వినోద్ కుమార్ ‘పైరసీ సెక్యూర్డ్ బోర్డ్’ కనిపెట్టి సరికొత్త పరిష్కారానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడున్న వాటర్ మార్క్ విధానానికి మించి ఈ టెక్నాలజీ అత్యాధునికమైనదని అంటున్నారు.

పైరసీ అడ్డుకునే క్రమంలో అమెరికా, జపాన్ వంటి దేశాలు తీసుకొచ్చిన పద్ధతులతో పోటీపడి వినోద్ కుమార్ కనిపెట్టిన టెక్నాలజీ పేటెంట్ హక్కులు దక్కించుకోవడం విశేషం. సాఫ్ట్ వేర్ టెక్నాలజీతో కాకుండా హార్డ్ వేర్ పద్ధతుల్లో వినోద్ కుమార్ పైరసీని అడ్డుకునే టెక్నాలజీ తీసుకొచ్చారు. దీంతో ప్రతి ధియేటర్లో ఈ టెక్నాలజీని అమర్చుకుంటే సెల్ ఫోన్ నుంచి ఎటువంటి అత్యాధునిక కెమెరా నుంచి కాపీ చేసినా చుట్టుపక్కల శబ్దాలు, తెల్లటి తెర తప్పితే సినిమా రికార్డ్ కావడం అసాధ్యమని చెప్తున్నారు వినోద్ కుమార్.

వినోద్ తీసుకొచ్చిన టెక్నాలజీని వివిధ దశల్లో పరీక్షలు జరిపిన అమెరికాలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ‘బెల్ కామ్ టెక్నాలజీ’ ఈ అధునాతన టెక్నాలజీని త్వరలో ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిని అన్నిదశల్లోనూ పరిక్షలు జరిపామని.. ఇదొక అద్భుతమని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. పవన్ కల్యాణ్ పంజా సినిమాకు పనిచేసిన అనుభవం ఉన్న వినోద్ కుమార్ దాదాపు 8ఏళ్లు కష్టపడి ఈ టెక్నాలజీకి రూపకల్పన చేశారు. ఈ టెక్నాలజీ అమర్చుకునేందుకు ధియేటర్లలో తెర ముందు, తెర వెనుక ఏర్పాట్లు చేస్తే సరిపోతుందని.. మరి ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.

రెండు దశాబ్దాల క్రితం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సీడీల్లో పైరసీలు జరిగి సినిమాలకు భారీ నష్టం వాటిల్లేది. విస్తృత ప్రచారం అనంతరం ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పు తీసుకురాగలిగారు. అనంతరం వాటర్ మార్క్ ద్వారా పైరసీ ఎక్కడ జరిగిందో కనిపెట్టి చర్యలు తీసుకుంటున్నా.. సరికొత్త పద్ధతుల్లో పైరసీ చేస్తున్నారు. ఇటివల రామ్ చరణ్ గేమ్ చేంజర్ HD ప్రింట్ లోకల్ చానెల్స్ లో ప్రసారం చేయడం.. నాగచైతన్య తండేల్ ఏకంగా ఆర్టీసీ బస్సులో ప్రసారం చేయడం, సోషల్ మీడియాలో లింక్స్ రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. దీంతో వినోద్ కుమార్ తీసుకొచ్చిన టెక్నాలజీ సినీ పరిశ్రమకు వరంలా మారుతుందని ఆశిద్దాం..!

సినిమా

అల్లు అర్జున్ డ్యుయల్ రోల్..?

పుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టాడని తెలుస్తుంది. త్రివిక్రంతో చేయాల్సిన భారీ...

బ్లాక్ డ్రెస్ లో ‘బేబీ’ అదుర్స్..!

బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాతో రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న...

‘భైరవి’ పాత్ర చేయడం నా అదృష్టం : తమన్నా

'ఓదెల రైల్వే స్టేషన్‌'కి సీక్వెల్‌గా రూపొందిన 'ఓదెల 2' ఏప్రిల్‌ 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్‌,...

స్టైలిష్ లుక్ లో మహేశ్, సితార.. ఈ స్టిల్స్ చూశారా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఎస్ ఎస్ ఎంబీ29 సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు. ఎంత...

నిన్ను నువ్వు తిట్టుకుంటే సినిమా హిట్టవుతుందా ‘రాబిన్ హుడ్’.?

మార్చి 28న నితిన్ కొత్త సినిమా ‘రాబిన్ హుడ్’ విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లేమో కాస్తంత ఇన్నోవేటివ్‌గానే డిజైన్ చేశారు కూడా.! శ్రీలీల హీరోయిన్. వెంకీ...

రాజకీయం

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని...

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

బూతులు లేవు, బాధ్యతలు మాత్రమే.! కూటమి సర్కారుకి జన నీరాజనం.!

అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని...

కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ ప్రకంపనలు..

కర్ణాటక రాజకీయాలను హనీట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. కేవలం అధికార పార్టీనే కాకుండా అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కర్ణాటక సహకార మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా...

ఎక్కువ చదివినవి

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

రామ్ చరణ్ Birthday Special : రంగస్థలం ముందు ఆ తర్వాత..!

చిరంజీవి కొడుకు హీరో అవ్వడం తేలికే కానీ రామ్ చరణ్ అవ్వడం చాలా కష్టం. అదేంటి అనుకోవచ్చు. స్టార్ కొడుకు స్టార్ అవ్వడంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎలాగు ఫ్యాన్స్ భుజాన...

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది: చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు సన్మానించిన సంగతి తెలిసిందే. ఇంతటి సన్మానం...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 21 మార్చి 2025

పంచాంగం తేదీ 21-03-2025, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ సప్తమి రా. 11.50 వరకు నక్షత్రం:...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 18 మార్చి 2025

పంచాంగం తేదీ 18-03-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ చవితి సా. 7.02 వరకు...