కరోనా కారణంగా నిలిచిపోయిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాడిలో పెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాలేజీలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్ 15 నుంచి కాలేజీలు తెరవాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఉన్నత విద్యపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో కాలేజీల్లో నాడు – నేడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, డిగ్రీ కోర్సలపై పలు నిర్ణయాలు తీసున్నారు. జగన్ పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సెప్టెంబర్ లో ఉమ్మడి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరపాలని సూచించారు. విద్యా దీవెన, వసతి దీవెన అందించే ఏర్పాట్లు చేయాలని ఆర్ధికకశాఖ అధికారులను ఆదేశించారు. డిగ్రీ కోర్సుల్లో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ ను 90 శాతం వరకూ పెంచాలని అన్నారు. మూడేళ్లు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటీస్ చేయించాలని సూచించారు. ఆ తర్వాత మరో ఏడాది స్కిల్ డెవలెప్ మెంట్ కోర్సులపై దృష్టి పెట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలకు వెనుకాడొద్దని స్పష్టం చేశారు.
విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల్లో ఉన్న 1110 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేసేందుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారు. కాలేజీల్లో కూడా నాడు-నేడు కార్యక్రమం చేపట్టాలని సూచించారు. సమావేశంలో మంత్రి సురేశ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
944977 244172A thoughtful insight and suggestions I will use on my blog. Youve obviously spent plenty of time on this. Thank you! 850090