ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 8న ప్రత్యేక జీవోను విడుదల చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతమున్న టికెట్ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు ఆ జీవో ద్వారా జారీ చేసారు. దీని ప్రకారంగా మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర్ పంచాయత్, గ్రామ పంచాయత్ లుగా విభజిస్తూ రేట్లను స్లాబ్ లుగా చేసారు.
ఈ రేట్లపై టాలీవుడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గ్రామ పంచాయత్ పరిధిలో కేవలం 15 రూపాయల టికెట్ ఏమిటని ప్రశ్నించారు. ఈలోగా కరోనా సెకండ్ వేవ్ రావడంతో ఎవరూ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు.
ఇప్పుడు మళ్ళీ థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో థియేటర్లు రన్ అవుతున్నాయి. అయితే వైఎస్ జగన్ మాత్రం టికెట్ రేట్ల విషయంలో ఇంకా పట్టుగానే ఉన్నారు. ఈ విషయమై తనను ఎవరూ కలవాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది.
21775 311157Hello there, I discovered your blog by way of Google at the same time as searching for a comparable subject, your internet site got here up, it seems to be great. Ive bookmarked it in my google bookmarks. 200398
86555 834837I like this post really a lot. I will undoubtedly be back. Hope that I can go through more insightful posts then. Will likely be sharing your wisdom with all of my buddies! 156619