Margadarsi: మార్గదర్శి (Margadarsi) చిట్ ఫండ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సీఐడీని (AP CID) అనుమతించింది. రాష్ట్ర డిపాజిట్ దారుల హక్కుల పరిరక్షణ చట్టం 1999 ప్రకారం హోంశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం అనుమతితో చరాస్థుల జప్తు చేయనున్నారు. ఈ విషయాన్ని 50 బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు సమాచారం కూడా ఇచ్చారు. బ్యాంకులు, ఇతర సంస్థల్లోని తమ నిధులను బదిలీ చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మార్గదర్శి అక్రమాలకు పాల్పడుతూ కేంద్ర చిట్ ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ తనిఖీల్లో బయటపడినట్టు తెలుస్తోంది. లభించిన కీలక ఆధారాల నేపథ్యంలోనే ఈ చర్యలకు ఉప్రకమించినట్టు సమాచారం. గత డిసెంబర్ నుంచీ రాష్ట్రంలో మార్గదర్శి కొత్త చిట్టీలు నిలిసేసింది. సంస్థ డిపాజిట్ దారులు, చందాదారులకు మార్గదర్శి చెల్లింపులు చేసే పరిస్థితుల్లో లేదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు సీఐడీ ప్రభుత్వానికి లేఖ రాసింది.