మూలిగే నక్క నెత్తిన తాటికాయ పడటం అంటే ఇదే మరి.! ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి అత్యంత పతనావస్థకు చేరుకుంది. కేంద్రం ఆదుకుంటే తప్ప, రాష్ట్రం మనుగడ సాధించలేని పరిస్థితి. చంద్రబాబు హయూంలో పబ్లిసిటీ స్టంట్లు నడిచాయి.. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలోనూ అవే తరహా పబ్లిసిటీ స్టంట్లు నడుస్తున్నాయి.
చంద్రబాబు, అంతర్జాతీయ స్థాయి నగరం అమరావతి.. అని చెబితే, ‘ఒకటి కాదు.. ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు..’ అంటూ వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది. ప్రతి నెలా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కనా కష్టంగా మారిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో, కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన సంక్షోభం.. రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పాతాళానికి పడిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాలకు కేంద్రం సాయం చేయగలిగే పరిస్థితుల్లో వున్నప్పుడే, ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. కేంద్రం కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి చిల్లి గవ్వ అయినా వస్తుందా.? అన్న అనుమానాలు నెలకొన్నాయి. ప్రతి నెలా సంక్షేమ పథకాల కోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది రాష్ట్రానికి.
పది రోజుల ఇబ్బందికే, ఉద్యోగుల జీతాల్లో కోత విధించేయాల్సి వచ్చింది. ధనిక రాష్ట్రం తెలంగాణ కూడా ఇదే పద్ధతి అవలంబించాల్సి వస్తోందంటే.. దేశంలో ఆర్థిక పరిస్థితులు ఎలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే, ఆదాయార్జాన దిశగా కాస్త వెసులుబాటు దొరుకుతుందని దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఎదురుచూస్తున్నట్లే, ఆంధ్రప్రదేశ్ కూడా ఎదురుచూస్తోంది.
మిగతా రాష్ట్రాల పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్ దుస్థితి వేరు. కానీ, తప్పదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ని ముంచేసే నాయకులు తప్ప, ఆదుకునే నాయకులు కన్పించడంలేదు.
837656 872712Keep websiteing stuff like this I actually am fond of it 829301