కరోనా భయంతో యువతిపై గ్రామస్తుల దాడి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రతిఒక్కరికి భయ బ్రాంతులకు గురి చేస్తోంది. కాస్త అనుమానంగా ఎవరు కనిపించినా కూడా వారికి ఏమైనా కరోనా ఉందేమో అనే భయం ఎందరిలో వ్యక్త అవుతోంది. ఆ భయంతోనే 20 ఏళ్ల ఒక యువతిని హరియాణలో కొందరు కొట్టి గాయపరిచారు. బాధిత యువతి ఎంత చెప్పినా వినకుండా కొట్టారట.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… చోంగ్ హోయి మీసావో అనే యువతి ఇటీవల పైజాపూర్ కు స్నేహితురాలిని కలిసేందుకు వెళ్ళాను. అక్కడ కొందరు నన్ను అనుమానంగా చూసారు. అయినా నేను పట్టించుకోకుండా సామాజిక దూరం పాటించి అక్కడ భోజనం చేసి వచ్చాను. కానీ కొందరు నన్ను వైరస్ ను వ్యాప్తి చెందిస్తున్నావా అంటూ గొడవకు దిగారు. అదే సమయంలో మరి కొందరు నన్ను కొట్టేందుకు కర్రలతో వచ్చారు. నన్ను వారు కొడుతుండగా నేను అక్కడ నుండి వచ్చేశాను అంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఏంకౌరీ చేస్తున్నారు.
మెరీకోమ్ ను ఆశ్చర్యపర్చిన ఢిల్లీ పోలీసులు
భారత బాక్సింగ్ దిగ్గజం మెరీకోమ్ ను ఢిల్లీ పోలీసులు ఆశ్చర్యపర్చారు. కరోనా నియంత్రణ డ్యూటీలో తలమునకలై ఉన్న పోలీసులు మెరీకోమ్ ఇంటికి కేక్ తీసుకుని వెళ్లారు. లాక్ డౌన్ కారణంగా అన్నిచోట్లా బంద్ వాతావరణం ఉంది. ఇలాంటి సమయంలో మెరీకోమ్ చిన్న కొడుకు పుట్టిన రోజు అవ్వడంతో అతడికి కేక్ లేకుండా అయ్యింది. అతడి బర్త్ డే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేక్ పట్టుకుని మరి వెళ్లారు.
పోలీసుకు కేక్ పట్టుకు వచ్చి తన కొడుకు పుట్టిన రోజు నిర్వహించడంపై మెరీకోమ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి పుట్టిన రోజు మళ్ళీ రాదు. అతడికి ఇది ప్రత్యేకమైన పుట్టిన రోజు అంటూ మెరీకోమ్ ట్వీట్ చేశారు. రాజ్య సభ సభ్యురాలిగా ఉన్న మెరీకోమ్ ప్రస్తుతం ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులో ఉంటున్నారు. ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్ కోసం మెరీకోమ్ ఎదురు చూశారు. కానీ కరోనా కారణంగా అవి కాస్త క్యాన్సిల్ అయ్యాయి.
బైక్ యాక్సిడెంట్: బొత్స మేనల్లుడి కొడిక్కి గాయాలు.!
లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు టీవీల్లో, పేపర్లలో, నెట్లో యాక్సిడెంట్ కారణంగా జరిగే ఘోరాలను తక్కువగా చూస్తున్నాం. కానీ లాక్ డౌన్ సడలింపులు కారణంగా రోడ్ల మీద యాక్షిడెంట్లు మళ్ళీ ఎక్కువవుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో బైక్ పై వెళ్తున్న యువకులు అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ పడిన దగ్గరి నుంచి చాలా దూరం జారుకుంటూ వెళ్లడం వలన వారికి బాగానే గాయాలయ్యాయి.
అందులో ముఖ్యంగా ఒకతనికి మాత్రం గాయాలు ఎక్కువగా తగలడంతో రక్త స్రావం ఎక్కువగా జరగడంతో అక్కడి స్థానికులు వారిని వెంటనే దగ్గర్లోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ కి తరలించగా, అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ యువకుల్లో ఒకరు మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ కుమారుడని సమాచారం.
బోర్డర్ చెక్పోస్ట్పైకి దూసుకెళ్లిన లారీ.. ఎమ్మార్వో, ఆర్ఐలకు తీవ్ర గాయాలు
తెలంగాణలోకి వస్తున్న వలస కార్మికులను మరియు ప్రయాణికులను అధికారులు క్షుణ్ణంగా పరీక్షించి స్క్రీనింగ్ టెస్టును నిర్వహించి మరీ రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఖమ్మం జిల్లా సరిహద్దు అశ్వరావు పేట వద్ద బోర్డర్ చెక్ పోస్ట్ను ఏర్పాటు చేసి వలస కార్మికులను పరీక్షిస్తున్నారు. ఉదయం సాయంత్రం ఎమ్మార్వో స్థాయి అధికారి మరియు పోలీసు శాఖ వారు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. నేడు తెల్లవారు జామున కూడా అక్కడ చెక్ పోస్ట్ వద్ద ఎమ్మార్వో మరియు ఆర్ఐ తోపాటు పోలీసులు డ్యూటీ నిర్వహిస్తున్నారు.
ఆ సమయంలో ఒక లారి అదుపు తప్పి అధికారులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ టెంట్ వద్దకు దూసుకు వచ్చింది. ప్రమాదంను కొన్ని క్షణాల ముందు గుర్తించిన ఎమ్మార్వో మరియు ఆర్ఐలు అక్కడ నుండి దూరంగా పరుగులు పెట్టారు. అదే సమయంలో అక్కడ వలస కూలీలు కూడా ఉన్నారు. వారిలో కొందరు కూడా లారీ దూసుకు వస్తుండటంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఎవరు మృతి చెందలేదు, కాని ఎమ్మార్వో మరియు ఆర్ఐలు గాయాలపాలయ్యారు.
83344 748804Undoubtedly,Chilly spot! We stumbled on the cover and Im your personal representative. limewire limewire 386759