ప్రజల్ని ఉద్ధరించేస్తామని చెబుతూ ప్రభుత్వాలు అప్పులు చేయడం అన్నది నయా ట్రెండ్ అనుకోవాలేమో. ఏ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఎక్కువ అప్పు జరిగితే అదో గొప్ప రికార్డు.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఒకప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ‘ప్రపంచ బ్యాంకు జీతగాడు’ అనే విమర్శల్ని ఎదుర్కొన్నారు. అలా ఆయన్ని విమర్శించినవాళ్ళు అంతకు మించి.. అనే స్థాయిలో అప్పులు చేసేశారు. వాళ్ళని ప్రపంచ బ్యాంకు దగ్గర పాలేళ్ళు.. అనాలేమో.
రాజకీయాల్లో విమర్శలు సహజం. మొన్నీమధ్యనే ఏపీకి చెందిన ఓ మంత్రిగారు, ‘మేం ప్రతిపక్షంలో వుంటే, పన్నులు తగ్గించమనే అంటాం. ప్రభుత్వం నడవాలంటే పన్నులు వేయాలి కదా. అభివృద్ధి జరగాలంటే అప్పులు చేయాలి కదా..’ అని సెలవిచ్చారు. మరి, అప్పులు చేసి.. అక్కడికేదో సొంత జేబుల్లోంచి ఖర్చు చేసినట్లు పబ్లసిటీ చేసుకోవడమేంటి.? అన్న ప్రశ్నకు అధికార పార్టీ దగ్గర సమాధానం దొరకదు.
ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనల కోసం చేసే ఖర్చు కూడా ప్రజా ధనమే. సరే, ఆ విషయం పక్కన పెడదాం. ఆంధ్రపదేశ్ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఈ విషయమై తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. ప్రతి నెలా అప్పులు చేయాల్సిన దుస్థితి రాష్ట్రానికి పట్టిందనీ, రాష్ట్రం ఇప్పటికే చేసిన అప్పులకి వడ్డీలు కట్టడం కూడా గగనమైపోయే పరిస్థితులు రావొచ్చనీ, కేంద్రం జోక్యం చేసుకుని.. ఇంకా ఎక్కువ అప్పులు రాష్ట్రం చేయకుండా, రాష్ట్ర ప్రజల బతుకులు దుర్భరం కాకుండా చర్యలు తీసుకోవాలని రఘురామ ఆ లేఖలో ప్రస్తావించారు.
రఘురామ, వైసీపీ మీద అక్కసుతో అలా లేఖ రాశారా.? అన్నది వేరే చర్చ. కానీ, ఆయన లేఖలో విషయాలు మాత్రం వాస్తవాలే. టీడీపీ హయాంలో చంద్రబాబు ఫొటోలతో పబ్లిసిటీ.. వైసీపీ హయాంలో వైఎస్ జగన్ ఫొటోలతో పబ్లిసిటీ.. చివరికి రాష్ట్రం పేరుతో ప్రభుత్వాలు చేసే అప్పులకి బాధ్యత మాత్రం.. ప్రజలదే. పాలకుల్ని ఈ అప్పుల విషయమై ప్రజలు ప్రశ్నించనంతవరకు.. పరిస్థితి ఇలాగే వుంటుంది.
762607 147404Cool text dude, maintain up the good work, just shared this with the mates 301327
238944 494973Hi, Thanks for your page. I discovered your page via Bing and hope you keep providing much more good articles. 679150