Switch to English

అప్పుల కుప్ప ఆంధ్రపదేశ్.. అయినా పాలన అద్భుతః

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

ప్రజల్ని ఉద్ధరించేస్తామని చెబుతూ ప్రభుత్వాలు అప్పులు చేయడం అన్నది నయా ట్రెండ్ అనుకోవాలేమో. ఏ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఎక్కువ అప్పు జరిగితే అదో గొప్ప రికార్డు.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఒకప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ‘ప్రపంచ బ్యాంకు జీతగాడు’ అనే విమర్శల్ని ఎదుర్కొన్నారు. అలా ఆయన్ని విమర్శించినవాళ్ళు అంతకు మించి.. అనే స్థాయిలో అప్పులు చేసేశారు. వాళ్ళని ప్రపంచ బ్యాంకు దగ్గర పాలేళ్ళు.. అనాలేమో.

రాజకీయాల్లో విమర్శలు సహజం. మొన్నీమధ్యనే ఏపీకి చెందిన ఓ మంత్రిగారు, ‘మేం ప్రతిపక్షంలో వుంటే, పన్నులు తగ్గించమనే అంటాం. ప్రభుత్వం నడవాలంటే పన్నులు వేయాలి కదా. అభివృద్ధి జరగాలంటే అప్పులు చేయాలి కదా..’ అని సెలవిచ్చారు. మరి, అప్పులు చేసి.. అక్కడికేదో సొంత జేబుల్లోంచి ఖర్చు చేసినట్లు పబ్లసిటీ చేసుకోవడమేంటి.? అన్న ప్రశ్నకు అధికార పార్టీ దగ్గర సమాధానం దొరకదు.

ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనల కోసం చేసే ఖర్చు కూడా ప్రజా ధనమే. సరే, ఆ విషయం పక్కన పెడదాం. ఆంధ్రపదేశ్ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఈ విషయమై తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. ప్రతి నెలా అప్పులు చేయాల్సిన దుస్థితి రాష్ట్రానికి పట్టిందనీ, రాష్ట్రం ఇప్పటికే చేసిన అప్పులకి వడ్డీలు కట్టడం కూడా గగనమైపోయే పరిస్థితులు రావొచ్చనీ, కేంద్రం జోక్యం చేసుకుని.. ఇంకా ఎక్కువ అప్పులు రాష్ట్రం చేయకుండా, రాష్ట్ర ప్రజల బతుకులు దుర్భరం కాకుండా చర్యలు తీసుకోవాలని రఘురామ ఆ లేఖలో ప్రస్తావించారు.

రఘురామ, వైసీపీ మీద అక్కసుతో అలా లేఖ రాశారా.? అన్నది వేరే చర్చ. కానీ, ఆయన లేఖలో విషయాలు మాత్రం వాస్తవాలే. టీడీపీ హయాంలో చంద్రబాబు ఫొటోలతో పబ్లిసిటీ.. వైసీపీ హయాంలో వైఎస్ జగన్ ఫొటోలతో పబ్లిసిటీ.. చివరికి రాష్ట్రం పేరుతో ప్రభుత్వాలు చేసే అప్పులకి బాధ్యత మాత్రం.. ప్రజలదే. పాలకుల్ని ఈ అప్పుల విషయమై ప్రజలు ప్రశ్నించనంతవరకు.. పరిస్థితి ఇలాగే వుంటుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...