మహిళా దినోత్సవం రోజున ఆడపడుచులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కానుకలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,095FansLike
57,764FollowersFollow

మహిళాభ్యుదయానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరచూ చెబుతుంటారు. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం, మహిళా దినోత్సవం సందర్భంగా, రాష్ట్రంలోని మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాల్ని ప్రారంభిస్తోంది.

మహిళా సంక్షేమం, వివిధ రంగాల్లో మహిళలు రాణించడం.. ధ్యేకంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఈ క్రమంలో పలు ఎంవోయూలు కుదుర్చుకోవడంతోపాటు, పలు పథకాలు ప్రారంభించడం, ఆయా కార్యక్రమాలకు నిధులు కేటాయించడం.. జరుగుతోంది.

మహిళా దినోత్సవరం సందర్భంగా ప్రభుత్వం మెప్మా కింద 30 వేల మంది కొత్త మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రకటిస్తుంది. వీరికి అవకాశాలు, స్వయం ఉపాధి, ఆర్థిక వెసులుబాటు అందిస్తుంది. 10 వేల మంది మహిళలను రాపిడో డ్రైవింగ్ విభాగం, 4 వేల మంది స్వయం ఉపాధి పథకాల్లో, 4 వేల మందిని కేంద్ర ప్రాయోజిత పథకాల్లో, 4 వేల మందిని పర్యాటక అనుంబంధ రంగాల్లో, 4 వేల మంది తృప్తి హోటల్స్ స్థాపనలో, 2 వేల మంది స్మార్ట్ స్ట్రీట్స్ వెండింగ్ జోన్‌లో, మరో 2 వేల మందికి టిడ్కో జీవనాధారం కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

వ్యవసాయాధిరిత, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సర్వీస్ సెక్టార్, వ్యాపారాల్లో సుమారు 1 లక్ష మంది మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.ఎంఎస్ఎంఈలో 10 వేల మందికి జీవనోపాధి కల్పించేందుకు 2025-26 సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.

ఆంధ్రప్రదేశ్ మహిళా డిజిటల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లో మైలురాయిని చేరుకుంటుంది. డ్వాక్రా మహిళలు 1 లక్షకు పైగా ఉత్పత్తులను ONDC ద్వారా Wow Geni యాప్‌లో విక్రయిస్తారు. దీని వలన రూ.1.6 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.

“మహిళలకు మహిళల కోసం మహిళల చేత” అనే కార్యక్రమం గిన్నీస్ రికార్డును నమోదు చేస్తుంది. సెర్ప్, మెప్మా విభాగం, స్వయం సహాయ సంఘాల ఉత్పత్తులకు బ్యాంక్ లింకేజీ : మెప్మా కింద 7,471 మంది లబ్ధిదారులకు 645.52 కోట్ల బ్యాంకు రుణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పంపిణీ చేస్తారు.

బ్యాంక్ లింకేజ్ ఉత్పాదక రుణాల పథకం కింద మొత్తం రూ.1,826.43 కోట్లు మంజూరు చేస్తారు. స్త్రీ నిధి సంస్థ ద్వారా ఉత్పాదక రుణాల కింద రూ.1,000 కోట్లు మంజూరు చెక్ అందజేస్తారు.

ఫ్లిప్‌కార్ట్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంటుంది. దీనిలో భాగంగా డ్వాక్రా సంఘాల ఉత్పత్తల విక్రయాలకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. సెర్ప్, కేటలిస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌ పై అవగాహన ఒప్పందం, వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులపై డ్వాక్రా మహిళలకు వ్యాపార శిక్షణ అందించడంపై క్యాటలిస్టు మేనేజ్ మెంట్ సర్వీసెస్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుంది.

వ్యవసాయాధారిత ఉత్పత్తులకు వ్యాల్యూ చైన్ అందించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటారు. సెర్ప్, సీసీడీతో ఒప్పందం :
డ్వాక్రా సంఘాలు సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు CCD(సెంటర్ ఫర్ కలెక్టివ్ డవల్మెంట్) తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుంది.

చిన్న తరహా హోటల్ వ్యాపారంలో డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించడానికి గాటోస్ కేఫ్‌తో ఒప్పందం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుంది. దీని ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పన లభిస్తుంది.

సర్వీస్ ప్రొవైడర్ల జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి హోమ్ ట్రయాంగిల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటంది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18,515 సర్వీస్ ప్రొవైడర్లకు ప్రయోజనం చేకూరుతుంది. దీని ద్వారా నెలకు రూ.15,000 నుంచి రూ.35,000 నికర ఆదాయం వస్తుంది. సర్వీస్ ప్రొవైడర్లలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు, గృహోపకరణ మరమ్మతు నిపుణులు ఉంటారు.

రాపిడో ప్రతినిధులతో అవగాహన ఒప్పందం. రాష్ట్ర వ్యాప్తంగా 1,000 ఎలక్ట్రిక్ వాహనాలు మహిళా లబ్ధిదారులకు లబ్ధిదారులకు అందించబడతాయి. వాటిలో 760 ఈ బైక్‌లు, 240 ఈ ఆటోలు ఉంటాయి. ప్రకాశం జిల్లా నుండి 10 ఇ-బైక్‌లు, 10 ఇ-ఆటోలు లబ్ధిదారులకు కేటాయింపు. వీటికి ప్రభుత్వం రుణసదుపాయం కల్పిస్తుంది.

ఆన్‌బోర్డింగ్ ఛార్జీలు, నెలవారీ చార్జీలను మూడు నెలల పాటు మాఫీ చేస్తుంది. చందా రుసుము (మూడు నెలలకు) మాఫీ చేస్తుంది. దీని ద్వారా సుమారు రూ.30 వేల వరకు ఆదాయం పొందవచ్చు.

రాష్ట్రంలోని 55,607 మంది అంగన్వాడీ వర్కర్లకు, 48,909 మంది అంగన్వాడీ హెల్పర్లకు మేలు చేకూర్చేలా తీసుకున్న గ్రాట్యూటీ నిర్ణయంపై ముఖ్యమంత్రి వివరిస్తారు.

దీని ద్వారా ఒక్కో అండన్వాడీ వర్కర్ రూ.1.79 లక్షల నుంచి రూ.2.32 లక్షల వరకు లబ్ధి పొందుతారు. అంగన్వాడీ హెల్పర్లకు రూ.1.09 లక్షల నుంచి రూ.1.41 లక్షల వరకు లబ్ధి పొందుతారు. దీన్ని అమలు చేసినందుకు ప్రభుత్వంపై ఏటా రూ.17.73 కోట్ల భారం పడుతుంది.

2024 జూన్ నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన, మరణించిన ఆశా వర్కర్లకు గ్రాట్యూటీ అమలవుతుంది. గతేడాది జూన్ నుంచి రిటైర్డ్ అయిన వారికి గాను గ్రాట్యూటీ కింద మొత్తం రూ.1.90 కోట్లు విడుదల చేయనుంది.

పిఎం – విశ్వకర్మ పథకం ద్వారా 1000 మంది మహిళలకు రూ. 1 లక్ష వరకు రుణాలు. మహిళా సంఘాల ద్వారా అరకు కాఫీ ప్రమోషన్ కు 100 అవుట్ లెట్లు, 100 హోటళ్లు.

ఇలా మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టే పలు కార్యక్రమాలు రాష్ట్రంలోని మహిళా స్వయం సాధికారతకు ఉపకరిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అయిన మహిళా లోకం, ఆర్థికంగా శక్తిని పుంజుకుంటే, సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుందనేది కూటమి ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

సినిమా

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

రాజకీయం

టీడీపీ కొత్త కమిటీలు: లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్… సీనియర్లకు గౌరవం, కొత్తవారికి ఛాన్స్

అమరావతిలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను అధికారికంగా ప్రకటిస్తూ, కొత్త సమీకరణాలతో ముందుకు వెళ్లే సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో Nara...

తిరుపతిలో క్రీడా విప్లవం… ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన లోకేష్

తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వేగం పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh తిరుపతిలో పలు క్రీడా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గొల్లవానిగుంటలో...

“సిద్ధాంతాలే బలం… కార్యకర్తలే శక్తి”: లోకేష్ సందేశం

మంగళగిరిలో జరిగిన టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జిల శిక్షణ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు. “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు....

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ఎక్కువ చదివినవి

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న ఆయన పుట్టినరోజు సందర్భంగా టీజర్ లేదా...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

అమరావతిపై కేంద్రం స్పీడ్.. వైసీపీకి ఢిల్లీ సిగ్నల్స్ మిస్ అయ్యాయా?

అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తాజాగా అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెలువడిన...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. వాలీబాల్ ప్రాక్టీస్...