Switch to English

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి గిన్నిస్ రికార్డులు సాధించింది. ఈ కారిడార్‌లోని సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రాంతంలో వానవోలు–వంకరకుంట–ఓదులపల్లె సెక్షన్ (ప్యాకేజ్–2,3)లో జరిగిన పనులు దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందాయి.

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

ఈ నెల 6వ తేదీ ఉదయం 10.07 గంటల నుంచి 11వ తేదీ ఉదయం వరకు నిరంతరంగా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగాయి. కేవలం ఆరు రోజుల్లోనే 52 కిలోమీటర్ల పొడవున (మొత్తం 156 లేన్ కిలోమీటర్లు) కాంక్రీట్ రోడ్డు నిర్మించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఒకే రోజులో 28.896 లేన్ కిలోమీటర్ల మేర రోడ్ పేవింగ్ చేసి రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ రెండు గిన్నిస్ రికార్డులు సాధించడం గమనార్హం. తాజా విజయంతో బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో మొత్తం నాలుగు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి.

రోడ్డు నిర్మాణంలో భాగంగా 57,500 మెట్రిక్ టన్నుల కాంక్రీటును అత్యంత వేగంగా, పూర్తి నాణ్యతతో వినియోగించారు. 70 టిప్పర్లు, ఐదు మిక్సింగ్ ప్లాంట్లు, 17 రోలర్లతో నిరంతరంగా పనులు సాగాయి. క్వాలిటీ ప్రమాణాల్లో ఏ మాత్రం రాజీ పడకుండా పనులు పూర్తిచేయడం నేషనల్ హైవే అథారిటీ పనితీరుకు నిదర్శనంగా నిలిచింది.

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

ఈ అసాధారణ విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టిన నేషనల్ హైవే అథారిటీ, రాష్ట్ర అధికారులు, అలాగే రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థను ఆయన అభినందించారు. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించిన మిగిలిన పనులను కూడా ఇదే స్ఫూర్తితో, వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మౌలిక వసతుల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఈ ఘనత మరోసారి నిరూపించిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

సినిమా

బిగ్‌బాస్‌తో గుర్తింపు.. ఐటెమ్ సాంగ్‌తో మళ్లీ వార్తల్లోకి శ్రష్టి వర్మ

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు...

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

రాజకీయం

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుభుదేంద్ర తీర్థ ఆవేదన

అమరావతి: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో గతంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై...

నెయ్యి కొనుగోలు ఆరోపణలపై టిటిడి స్పష్టీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టిటిడి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం...

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

ఎక్కువ చదివినవి

అంబటి వ్యాఖ్యలపై మండలిలో మంత్రి లోకేష్ ఫైర్

అమరావతి: శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి...

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుభుదేంద్ర తీర్థ ఆవేదన

అమరావతి: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో గతంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై...

‘హే బలవంత్‌’లో నవ్వులు, ఎమోషన్‌ గ్యారంటీ అంటున్న శివానీ నగరం

బన్నీవాస్‌, వంశీ నందిపాటి కాంబినేషన్‌లో రూపొందిన ‘హే బలవంత్‌’ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే చిత్రం ముందుగా ‘హే భగవాన్‌’గా ప్రకటించబడగా, తాజా టైటిల్‌ ‘హే బలవంత్‌’గా మారింది....

Daily Horoscope: ఉద్యోగాల్లో పురోగతి.. కుటుంబంలో శుభవార్తలు

ఫిబ్రవరి 18, 2026 బుధవారం రాశిఫలాలు: మేషం (Aries): కొత్త పనులకు శుభారంభం చేసే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఆశించిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో సమయం...

 జీఓ 117 రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ విద్యార్థులు: అసెంబ్లీలో నారా లోకేష్ వెల్లడి 

అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117 కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన...