మా ఎన్నికల్లో ఈసీ మెంబర్ గా పోటీ చేసిన జబర్దస్త్ యాంకర్ అనసూయ అనూహ్యంగా ఓటమి పాలవ్వడం ఆమె అభిమానులకు చాలా ఆందోళన కలిగించింది. అయితే ఆమె ఓటమి అనూహ్య పరిణామాల మద్య జరిగింది. ఆదివారం రాత్రి ఆమె గెలిచినట్లుగా వార్తలు వచ్చాయి. ఆమెకు స్పష్టమైన మెజార్టీ ఉందని అంతా అన్నారు. అదే సమయంలో ఆమె గిలిచినట్లే అంటూ కొందరు ప్రకటించారు. కాని సోమవారం విడుదల అయిన ఫలితాల్లో ఆమె ఓడినట్లుగా నిర్థారించారు. ఆమె ఓటమి ప్రకటనతో అంతా కూడా అవాక్కయ్యారు. బ్యాలట్ పేపర్స్ ఇంటికి తీసుకు వెళ్లారు అనే అనుమానాలను ఆమె వ్యక్తం చేసింది.
ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసిన ఆమె ఓడి పోయినా కూడా మీడియా ముందుకు వచ్చింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేసేందుకు సిద్దం అయ్యారు. నిన్నటి ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ లో అనసూయ పాల్గొంది. ఆ సమయంలో అనసూయ మాట్లాడుతూ నేను కనుక జర్నలిస్ట్ అయ్యి ఉంటే న్యూస్ రిపోర్ట్ చేస్తాను కాని నేను న్యూస్ ను కుక్ చేయను అంది. కొందరు కావాలని నాపై వార్తలు రాస్తున్నారు. గెలిచినా ఓడినా కూడా నేను మా కోసం పని చేసేందుకు సిద్దంగా ఉన్నాను. నా పై తప్పుడు వార్తలు రాస్తే ఖచ్చితంగా వారిపై కోర్టుకు వెళ్తాను అంటూ హెచ్చరించింది.
720672 422998Thanks for another informative post. Exactly where else could anyone get that kind of info in such a straightforward to realize way of presentation. 920721
746458 714930Basically received my initial cavity. Rather devastating. I would like a super smile. Seeking a great deal much more choices. Several thanks for the article 394232