గ్లామర్ యాంకర్ అనసూయ .. ఓ వైపు యాంకర్ గా టివి రంగంలో దుమ్ము రేపుతూనే మరో వైపు సెలెక్టీవ్ పాత్రలతో మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇక జబర్దస్త్ టివి షో ద్వారా సూపర్ పాపులారిటీ అందుకున్న ఈ అమ్మడికి తాజాగా మరోసారి సుకుమార్ క్రేజీ అఫర్ ఇచ్చాడు. ఇంతకు ముందు రామ్ చరణ్ రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర ఇచ్చి అనసూయను నటిగా మరో మెట్టు ఎక్కించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో మంచి రోల్ ని అఫర్ చేసాడు.
ఈ మధ్య అనసూయ చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు. రంగస్థలం సినిమా తరువాత అనసూయ చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. అటు సోలో హీరోయిన్ గా కథనం అంటూ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దాంతో సినిమాల్లో నటిగా తన సత్తా చాటుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న అనసూయ ఇప్పుడు నిర్మాతగా మారేందుకు రెడీ అయ్యింది. అనసూయ పిక్చర్స్ అనే బ్యానర్ ని రిజిస్టర్ కూడా చేసిందట. ఈ బ్యానర్ పై తన అభిరుచికి తగ్గ సినిమాలు, నటిగా తన టాలెంట్ నిరూపించుకునే సినిమాలు చేయాలన్నది ఆమె ఆలోచన.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో .. పెద్ద పెద్ద నిర్మాతలే సినిమాలు తీయడానికి భయపడుతున్నారు. అలాంటి సమయంలో అనుష్క రిస్క్ చేయడం ఎందుకు అని ఆమె సన్నిహితులు చెబుతున్నారట. అయినా సరే తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే రిస్క్ తప్పదని చెబుతుందట అనసూయ.
662299 872746Vi ringrazio, ho trovato che quanto scritto non sia completamente corretto 944129