అనసూయ భరద్వాజ్( Anasuya) .. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండరు. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. మెల్లగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వెండి తెరమీద తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కినేని నాగార్జున( Nagarjuna) నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో నాగ్ తో స్టెప్పులేసింది. ఆ తర్వాత ‘క్షణం’ మూవీలో సపోర్టివ్ రోల్ చేసింది.
స్టార్ డైరెక్టర్ సుకుమార్( Sukumar) దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan) నటించిన ‘రంగస్థలం’ లో రంగమ్మత్త పాత్ర అనసూయ జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మెల్లగా బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి సినిమాల్లో బిజీ అయిపోయింది. మధ్యలో అడపాదడపా ఐటమ్ సాంగ్స్ లోను కనిపిస్తోంది. కెరీర్ పరంగా బిజీగా ఉన్న అనసూయ.. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొందట. ఇటీవల ఇంటర్వ్యూలో ఆ విషయాలని బయటపెట్టింది.
అనసూయ తండ్రి రాజకీయ నాయకుడు కావడంతో ఆమె సినిమాల్లో నటించడానికి ఒప్పుకోలేదట. దీంతో ఆమె చిన్న వయసులోనే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆమెకు ఫ్రెండ్స్ సహకారం అందించడంతో ఓ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసింది. అక్కడ ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. అతనితో లివింగ్ రిలేషన్ లో ఉందట. ఇద్దరూ ప్రేమించుకున్నారు కూడా. ఈ విషయం అనసూయ తండ్రికి తెలియడంతో ఆమెకు పెళ్లి చేయాలని ఇంటికి తీసుకెళ్లారు.
పెళ్లి ఇష్టం లేని అనసూయ తాను ప్రేమించిన వ్యక్తి దగ్గరికి పారిపోయి వచ్చేసిందట. అలా 9 ఏళ్ల పాటు అనసూయ తను ప్రేమించిన వ్యక్తితో ఒకే గదిలో ఉండేదట. ఆ తర్వాత అనసూయ తన ఇంట్లో వాళ్ళని ఒప్పించి అతన్ని పెళ్లి చేసుకుంది. ఇంతకీ అతను ఎవరో అర్థమైందిగా. అతనే అనసూయ భర్త శుశాంక్ భరద్వాజ్. వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెళ్లయిన తర్వాత కూడా అనసూయ బోల్డ్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది.