Switch to English

పరకామణి చోరీపై ఆనం ఘాటు విమర్శలు… జగన్ వ్యాఖ్యలపై తీవ్రమైన ఆగ్రహం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,202FansLike
57,764FollowersFollow

టీటీడీ పరకామణి చోరీ ఘటనపై మంత్రివర్గ సభ్యుడు ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న వ్యవహారంగా చెప్పి భక్తుల విశ్వాసాలను తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని ఆయన అన్నారు. పరకామణి చోరీని చిన్న అంశంగా చూస్తే, తన దృష్టిలో పెద్ద దోపిడీ ఏంటో కూడా జగనే చెప్పాలని ఆనం మండిపడ్డారు. 70 వేల రూపాయలు దొంగిలించిన వ్యక్తి.. రాజీ కోసం కోట్ల విలువైన ఆస్తులు ఎలా రాసుకున్నాడో ప్రజలకు చెప్పాల్సిందిగా ప్రశ్నించారు.

జగన్ పాలనలో పరకామణి చోరీ నిరంతర ప్రక్రియగా సాగిందనీ, ఒక రోజు మాత్రమే సీసీ కెమెరాల్లో కనిపించిన దొంగ.. మొత్తం వ్యవస్థలో ఉన్న రేణువులాంటివాడేనని ఆనం వ్యాఖ్యానించారు. పవిత్రమైన తిరుమలలో పాలచుక్క కూడా లేకపోయినా ప్రసాదానికి నెయ్యి కనిపెట్టడం జగన్ పాలనలో జరిగిన పెద్ద వింత అని ఎద్దేవా చేశారు. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఎలా ఉంటుందో గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు చూసారని ఆయన అన్నారు.

టీటీడీపై జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రజలు ఇంకా మర్చిపోని ఐదు సంవత్సరాల మాఫియా పాలనను గుర్తుకు తెస్తున్నాయన్నారు. ప్రతి వ్యవస్థలో బంధు గణాన్ని పెట్టి దోపిడీకి తలుపులు తెరిచారని ఆరోపించారు. స్వామివారి ప్రసాదం వంటి పవిత్రమైన వ్యవస్థలలో కూడా దగా జరిగినట్లు విమర్శించారు. దొంగే దొంగా అని పరిగెత్తినట్లే జగన్ వ్యవహారం ఉందని ఆనం వ్యాఖ్యానించారు.

మొత్తానికి, జగన్.. మాఫియా సామ్రాజ్యానికి అధినేత కావడంతో వాస్తవాలు వినడానికే సిద్ధంగా లేరని, అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ సామ్రాజ్యాన్ని కట్టడి చేస్తుందని మంత్రి ఆనం స్పష్టం చేశారు. పరకామణి చోరీ వ్యవహారంపై నిజాలు బయటపడతాయని, భక్తుల నమ్మకాన్ని నిలబెట్టడం ప్రభుత్వ బాధ్యతేనని తెలిపారు.

Live Link: https://youtube.com/live/IarYNbiKSTE?feature=share

సినిమా

8 రోజుల్లో రాజా సాబ్… ఇంకా దూరమే గమ్యం!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ మధ్య తన ప్రయాణాన్ని...

మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర...

“చిరంజీవి సినిమా బాగుందంట…”ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్… 5 రోజుల్లోనే ₹226...

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ...

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

రాజకీయం

పవన్ కళ్యాణ్: పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే కూటమి ప్రభుత్వం… గ్రీన్ ఎనర్జీలో ఏపీకి కొత్త దిశ

పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వాలు మారినా విధానాల్లో స్థిరత్వం ఉండాలన్నదే తమ ప్రభుత్వ...

మాట నిలబెట్టుకున్న సీఎం… ఉద్యోగుల ఖాతాల్లో నగదు

సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన పండుగలా మార్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల...

Liquor Scam Case: విజయ్ సాయిరెడ్డికి ఈడీ నోటీసులు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన...

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

ఎక్కువ చదివినవి

సంక్రాంతి బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న మెగా సినిమా!

సంక్రాంతి 2026 సీజన్‌లో ప్రేక్షకుల మొదటి ఎంపికగా నిలిచిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. విడుదలైన తొలినాళ్ల నుంచే ఈ సినిమా థియేటర్ల వద్ద అసాధారణ వాతావరణాన్ని సృష్టిస్తోంది. తెలుగురాష్ట్రాల...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

Chiranjeevi: అలాంటి ’చిరంజీవి’ మళ్ళీ తిరిగి వచ్చాడా..!? వచ్చాడు..

Chiranjeevi: ఓజీ సినిమాలో డైలాగ్.. ’అలాంటోడు మళ్ళీ తిరిగివస్తున్నాడా..?’ అని. అది పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి రాసింది. కానీ.. ’మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో చిరంజీవిని చూస్తే.. సోమవారం అయినా కలెక్షన్ల...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్ ఇస్తా: మీనాక్షి చౌదరి

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్‌లో మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించనుంది....

Daily Horoscope: మేషంలో ఉద్యోగ అవకాశాలు, వృషభంలో ఆర్థిక లాభాలు

జనవరి 13, 2026 బుధవారం రాశిఫలాలు: మేషం (Aries): ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. పై అధికారుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో చిన్న విషయాలపై చర్చలు ఉండొచ్చు....