Switch to English

వైఎస్ జగన్ దుష్టచతుష్టయం.. ఓ శవ రాజకీయం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,934FansLike
57,764FollowersFollow

రాజకీయ ప్రత్యర్థుల మీదకు దుష్టచతుష్టయం.. అనే అస్త్రాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2024 ఎన్నికల సమయంలో ప్రయోగించారుగానీ, అది కాస్తా వైసీపీకే గట్టిగా తగిలింది. వైసీపీనే దుష్టచతుష్టయంగా భావించి, 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడేశారు రాష్ట్ర ప్రజలు.

ఇక, ఆ దుష్టచతుష్టయం వికృత క్రీడలు రోజురోజుకీ కొత్త మార్గాల్ని వెతుక్కుంటున్నాయి.. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు.! తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.

ఈ తరహా దుర్ఘటనలు అత్యంత దురదృష్టకరం. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా, ఇలా ఎందుకు జరిగిందన్నదానిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పలువురు అధికారుల మీద ఇప్పటికే వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వుంటుంది.

కానీ, విపక్షం వైసీపీ అలా ఎందుకు బాధ్యతగా వ్యవహరిస్తుంది.? శవ రాజకీయాలకు అలవాటు పడిన పార్టీ కదా.? ఇక్కడా అదే చేసింది. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చెబుతున్నదాన్నిబట్టి, బాధితుల్ని ఆసుపత్రిలో పరామర్శించే క్రమంలో జగన్ దుష్టచతుష్టయం, బాధితులకు తెల్ల కవర్లు ఇచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులతో మాట్లాడించే ప్రయత్నం చేసిందట.

వైసీపీ దుర్మార్గానికి సంబంధించి విజువల్స్ సీసీటీవీలో నమోదయ్యాయని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చెబుతున్నారు. ఇంత దిగజారుడు రాజకీయం, ఇలాంటి శవ రాజకీయం.. ఇంతకుముందెవరూ చేసి వుండరన్నది మంత్రిగారి వాదన.

వైఎస్ జగన్, ఆసుపత్రికి వెళ్ళడానికి ముందు, దుష్టచతుష్టయంలోని వ్యక్తులు ఆసుపత్రిలోకి తమ అనుచరుల్ని పంపి, బాధితులకు తెల్ల కవర్లు ఇచ్చి, వారితో ప్రభుత్వంపై విమర్శలు చేయించేందుకు ప్రయత్నించారని ఆనం రాంనారాయణరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఆ దుష్టచతుష్టయమే టీటీడీని భ్రష్టుపట్టించిందంటూ ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైఎస్ జగన్ సహా, ఆ దుష్టచతుష్టయంలో వున్నదెవరు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా, దుష్ట చతుష్టయంలో వున్న వ్యక్తుల విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

సినిమా

Sanjay dutt: చనిపోతూ సంజయ్ దత్ కు ఆస్తి రాసిచ్చిన మహిళా...

Sanjay dutt: సినిమా నటులపై అభిమానం ఏస్థాయిలో ఉంటుందో నిరూపించారు ముంబైకి చెందిన నిషా పటేల్. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అంటే ఆమెకు ఎంతో...

Thandel: బస్సులో ‘తండేల్’ మూవీ ప్రదర్శన.. ఆర్టీసీ చైర్మన్ ఆగ్రహం

Thandel: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే.. పైరసీ సినిమాను ఇరకాటంలో పడేస్తోంది. సినిమా రిలీజైన రెండో రోజునే హెచ్...

చరణ్ నా కొడుకు లాంటి వాడు..!

తండేల్ ఈవెంట్ లో రామ్ చరణ్ గురించి తగ్గించి మాట్లాడాడని మెగా ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో అల్లు అరవింద్ ని టార్గెట్ చేస్తూ...

పృథ్వీ చేసిన కామెంట్ కు సినిమా మొత్తాన్ని బాయ్ కాట్ చేస్తారా..?

సినిమా నటుడు పృథ్వీ చేసిన ఒక్క కామెంట్ కు లైలా సినిమా మొత్తాన్ని బ్యాన్ చేయాలంటూ వైసీపీ చేస్తున్న రచ్చకు అసలు అర్థం ఉందా అంటున్నారు...

విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి రణ్ బీర్ కపూర్..!

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. VD12గా వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన...

రాజకీయం

శ్రీ రంగరాజన్ దాడిపై స్పందించిన పవన్ కళ్యాణ్..!

చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. వారాంతర సెలవుల్లో భక్తులంతా ఎక్కువగా చిలుకూరు వెళ్లి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతేకాదు అక్కడ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు...

జై జనసేన.! జనసేనగా రూపాంతరం చెందిన ప్రజారాజ్యం: చిరంజీవి

‘మా ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది మార్పు కోసం. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నదీ మార్పు కోసమే. సినిమాల్నీ, రాజకీయాల్నీ నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా, నా తమ్ముడు...

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి: ఆ నలుగురి అరెస్ట్‌తో వైసీపీ ‘డొంక’ కదులుతుందా.?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి’ వ్యవహారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుంది. వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోలుకు...

గెలుపోటములు: కేజ్రీవాల్ ఓ కేస్ స్టడీ.!

దేశ రాజధాని ఢిల్లీ.. అక్కడా సమస్యలున్నాయ్.! మంచి నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు.. వాట్ నాట్.! ఢిల్లీ ప్రజలు చాలాకాలంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అంటే, పార్లమెంటు సమావేశాలు.. ప్రధాని,...

చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?

సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ...

ఎక్కువ చదివినవి

చిరంజీవి ఫొటోతో సందీప్ రెడ్డి సంచలనం.. తెరపైకి ఆరాధన సినిమా..!

సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్లలో ఓ సెన్సేషన్. తీసింది రెండే సినిమాలు అయినా.. ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆయన తీసే సినిమాలకు ఓ సెపరేట్ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు....

చరణ్ నా కొడుకు లాంటి వాడు..!

తండేల్ ఈవెంట్ లో రామ్ చరణ్ గురించి తగ్గించి మాట్లాడాడని మెగా ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో అల్లు అరవింద్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ...

తండేల్ రిలీజ్ ముందే హంగామా..!

శుక్రవారం రిలీజ్ కాబోతున్న తండేల్ సినిమా ప్రీ రిలీజ్ హంగామా ఒక రేంజ్ లో ఉంది. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రాన్ని చందు మొండేటి డైరెక్ట్...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 11 ఫిబ్రవరి 2025

పంచాంగం తేదీ 11-02-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:57 గంటలకు. తిథి: శుక్ల చతుర్దశి రా. 7.00 వరకు, తదుపరి...

మేనల్లుడు రామ్ చరణ్ మీద పగబట్టేసిన ‘కంస మామ’?

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఎందుకు ‘కంస మామ’లా మారిపోయినట్టు.? మెగాభిమానుల సూటి ప్రశ్న ఇది. ఔను, నిర్మాత అల్లు అరవింద్‌ని మెగాభిమానులు ‘కంస మామ’గా అభివర్ణిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. రామ్...