విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ మృతుడి మిస్సింగ్ సంచలనం రేపింది. కరోనాతో వసంతరావు అనే వృద్ధుడు జూన్ 25న కరోనాతో మృతి చెందినా కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదు. మృతదేహాన్ని వారం రోజులుగా మార్చురీలోనే ఉన్న విషయాన్ని సిబ్బందే గుర్తించకపోయారు. పోలీస్ కేసు.. మీడియాలో కథనాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చివరకు వసంతరావు మృతదేహాన్ని ఆస్పత్రిలోనే గుర్తించడం విశేషం.
విజయవాడలో జరిగిన ఈ సంఘటన వ్యవస్థాగత లోపానికి సాక్ష్యంగా నిలుస్తోంది. వన్ టౌన్ కు చెందిన వసంతరావు ధనలక్ష్మీ భార్యాభర్తలు. వసంతరావు అనారోగ్యంగా ఉండడంతో స్థానిక ఆస్పత్రిలో వైద్యం చేయించారు. కరోనా లక్షణాలు వెలుగుచూడడంతో భర్తను ధనలక్ష్మి జూన్24న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. వసంతరావును వెంటిలేటర్ పై ఉంచి ధనలక్షిని ఇంటికి పంపేశారు. అయతే.. 25వ తేదీ ఉదయం ఆస్పత్రికి వెళ్లగా వసంతరావు లేడని ఆస్పత్రిలో చెప్పడంతో ధనలక్ష్మి విస్తుపోయింది. ఈ విషయమై అక్కడి వైద్యులకు, ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఆమె గోడు ఎవరూ పట్టించుకోలేదు.
ముందురోజు ఆస్పత్రిలో చేర్పించిన భర్త ఏమయ్యాడో తెలియక ఆ వృద్ధురాలు తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. వారు విచారణ చేయడం.. వృద్ధుడి మిస్సింగ్ అంటూ మీడియాలో కథనాలు రావడంతో ఆస్పత్రి వర్గాలు, ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమేరాల్లో ఫుటేజీలతో పరిశీలించారు. జూన్ 24న ఆస్పత్రిలో జాయిన్ కావడం వరకే ఉంది. మొత్తానకి జూన్ 25నే వసంతరావు మృతిచెందడంతో మృతదేహం వారం రోజులుగా మర్చురీలోనే ఉండిపోయినట్టు గుర్తించారు.
నిజానికి కోవిడ్ మృతుల వివరాలను ఫోన్ లో పొటో తీసి.. ఆస్పత్రి సిబ్బందే.. నేరుగా ఖననం చేసేందుకు తీసుకెళ్తారు. కానీ.. ప్రభుత్వాసుపత్రి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం వల్ల ఎటువంటి సమాచారం ఆమెకు దక్కలేదు. పైగా కోవిడ్ మృతదేహం అన్ని రోజులు ఉండిపోవడం కలకలం రేపుతోంది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో ధనలక్ష్మిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
576866 141208Hello! I could have sworn Ive been to this site before but after browsing via some of the post I realized its new to me. Nonetheless, Im undoubtedly pleased I discovered it and Ill be book-marking and checking back often! 365641
228275 662059Housing a different movement in a genuine case or re-dialed model. 24189