వరదలొస్తే కర్నూలు విలవిల్లాడిపోతుంది. తుపాన్లకు విశాఖ బెంబేలెత్తడం గతంలో చూశాం. కానీ, కృష్ణా నదికి ఎంత పెద్ద వరద వచ్చినా, అమరావతికి ఏమీ కాలేదు.. ఇదీ అమరావతికి మద్దతుగా నినదిస్తోన్న వారు చెబుతున్న మాట. నిజమే, వైఎస్ జగన్ హయాంలో కృష్ణా నదికి అతి పెద్ద వరద గత ఏడాది వచ్చింది. ఇప్పుడూ దాదాపు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ, అమరావతిలో ఎక్కడా ఒక్క ఎకరం కూడా ముంపు ప్రాంతంగా కనిపించడంలేదన్నది స్థానికంగా వెల్లువెత్తుతున్న అభిప్రాయం.
‘కృష్ణా నది కారణంగా అమరావతికి వరద ముప్పు పొంచి వుంది.. అమరావతి ముంపు ప్రాంతం..’ అంటూ కొన్నాళ్ళ క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాతే రాజధాని మార్పు అంశం తెరపైకొచ్చింది. అలాగని విశాఖ, కర్నూలు జిల్లాలపై ‘బురద చల్లే యత్నం’ కూడా సరికాదు. హైద్రాబాద్ని వరదలు ముంచెత్తుతున్నాయి.. అలాగని అది రాష్ట్ర రాజధాని కాకుండా పోతుందా.? చెన్నయ్ పరిస్థితేంటి.? బెంగళూరు సంగతేంటి.? ముంబై దాదాపుగా ప్రతి యేడూ వరదల్లో మునిగిపోతుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ‘ముంపు’ అనేది వైసీపీ ప్రభుత్వం చెబుతున్న ఓ కుంటి సాకు మాత్రమే. అమరావతిపై ‘కులం’ ముద్ర కూడా ఇందులో భాగమే. ‘దోపిడీ’ వ్యవహారంపై ఏడాదిగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం పట్ల కూడా చాలా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాక, సీబీఐ విచారణ కోరడమేంటి.? అన్న విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఏదిఏమైనా, మూడు రాజధానుల పేరుతో అమరావతి గొంతు కోసే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోందన్న విపక్షాల విమర్శలకు బలం చేకూరుతోంది. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానుల్ని భరించలేదు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. విశాఖ అభివృద్ధి చెందాల్సిందే. కర్నూలు కూడా అభివృద్ధి బాటలో పయనించాల్సిందే. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు.. ప్రధాన నగరాలన్నీ అభివృద్ధి చెందాలి. కానీ, దానికోసం ‘మూడు రాజధానులు’ అనే పబ్లిసిటీ స్టంట్తోనే సరిపెడతామంటే ఎలా.?
752654 983123I dont believe Ive seen all the angles of this topic the way youve pointed them out. Youre a true star, a rock star man. Youve got so significantly to say and know so a lot about the subject that I believe you ought to just teach a class about it 801908