కరోనా మహమ్మారి ప్రభావంతో దేశంలో విధించిన 21 రోజుల లాక్ డౌన్ వల్ల ఎంత నష్టమో తెలుసా? అక్షరాలా తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు. ఇది మన దేశ ప్రస్తుత బడ్జెట్ లో దాదాపు మూడో వంతు కావడం గమనార్హం.
ఈ మూడు వారాలపాటు అన్ని మూసివేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఇంత మొత్తం కోల్పోనుంది. లాక్ డౌన్ కారణంగా ఉత్పాదకత నిలిచిపోవడం, వ్యాపారాలు జరగకపోవడం, రవాణా వ్యవస్థ స్తంభించిపోవడం వంటి కారణాల వల్ల ప్రత్యక్షంగా రూ.9 లక్షల కోట్ల నష్టం వాటిల్లనున్నట్టు సంబంధిత నిపుణులు అంచనా వేశారు.
గత వారం పది రోజులుగా మార్కెట్ లో వచ్చిన నష్టాలకు ఇది అదనం. కరోనా కారణంగా ఇప్పటికే భారత స్టాక్ మార్కెట్లు కుదేలైన సంగతి తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.21 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.
మొత్తానికి ఇప్పటివరకు దాదాపు రూ.52 లక్షల కోట్ల సంపదను ఇన్వెస్టర్లు కోల్పోయారు. ప్రస్తుతం 21 రోజుల లాక్ డౌన్ వల్ల రూ.9 లక్షల కోట్లు కోల్పోతుండగా.. దీని ప్రభావం తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంది.
మరోవైపు కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలు, రోజుకూలీల కోసం కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఇది ప్రభుత్వంపై అదనంగా పడిన భారం.
అంటే భారత ఆర్థిక వ్యవస్థపై లాక్ డౌన్ కారణంగా ప్రత్యక్ష ప్రభావం దాదాపు రూ.11 లక్షల కోట్లు అన్నమాట. ఒకవేళ ఈ లాక్ డౌన్ 21 రోజుల తర్వాత కూడా కొనసాగితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.
895920 876550What might you recommend in regards to your put up that you made some days ago? Any sure? 190012
780787 540852There is visibly a bunch to know about this. I believe you created various very good points in functions also. 490651
7605 67016Hey! Fantastic post! Please do tell us when we can see a follow up! 602609