జులైలో తల్లికి వందనం.. లోకేష్ కీలక ఆదేశాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,220FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.

ఉండవల్లిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య శాఖలకు చెందిన అధికారులు పలు కార్యక్రమాల పురోగతిని మంత్రికి వివరించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ ధృవీకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, జులై మూడో వారంలో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన మంత్రి లోకేష్, అడ్మిషన్లు పెంచేందుకు వినూత్న చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే జూన్ 29న ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, జులై మూడో వారంలో మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు నిర్వహించనున్నట్లు నిర్ణయించారు. మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది.

ఉన్నత విద్యాశాఖ సమీక్షలో భాగంగా ఎంసెట్, పాలిసెట్, ఆర్‌సెట్ సహా రాష్ట్రంలో నిర్వహించే అన్ని కామన్ ఎంట్రన్స్ పరీక్షల నోటిఫికేషన్లు సకాలంలో విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. జాతీయ స్థాయి, ఇతర రాష్ట్రాల ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తేదీలు ఖరారు చేయాలని సూచించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల పెంపుపై కూడా మంత్రి చర్చించారు. మెకానికల్, సివిల్ కోర్సులకు మంచి డిమాండ్ ఉందని అధికారులు వివరించగా, అవసరమైన చర్యలు తీసుకోవాలని లోకేష్ సూచించారు. రాష్ట్రంలో ఉన్న 254 ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో సుమారు 1.88 లక్షల సీట్ల భర్తీకి సంబంధించి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్న జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలతో జరుగుతున్న చర్చల పురోగతిని మంత్రి సమీక్షించారు. జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర యువతకు మరిన్ని శిక్షణ అవకాశాలు లభించడంతో పాటు ఎన్‌సీసీ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన పేర్కొన్నారు.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

ఎక్కువ చదివినవి

మీ కుటుంబ సభ్యులను ఎవరైనా దూషిస్తే మీరు ఊరుకుంటారా?: అఖిల్ రాజ్ క్లారిటీ

'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి ఇటీవల ఓ డెలివరీ బాయ్‌తో జరిగిన ఘర్షణ కారణంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే....

Jana Nayagan: ‘జననాయగన్ కు తప్పని ఇబ్బందులు..’ ఆన్ లైన్లో ఎంతమంది చూశారో తెలుసా..?

Jana Nayagan: తమిళ అగ్ర హీరో, సీఎం విజయ్ నటించిన సినిమా ‘జననాయగన్’. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందే నటించిన చివరి సినిమాగా జననాయగన్ ప్రచారం జరిగింది. సినిమా షూటింగ్ గతేడాదే పూర్తయినా...

ఏవీబీ పురం సమస్యలపై ప్రేమ్ కుమార్ ఫైర్.. వెంటనే పరిష్కారం కోరుతూ డిమాండ్

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఏవీబీ పురం ప్రాంతంలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను ప్రభుత్వ అధికారులు అత్యవసరంగా పరిష్కరించాలని జనసేన నాయకుడు, నియోజకవర్గ మాజీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు....

అల్లూరి, పింగళి, రోశయ్యకు లోకేష్ ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం మూడు ప్రముఖ తెలుగు మహనీయులను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, భారత...

World Social Media Day Special: గాడ్ ఆఫ్ వార్’తో మొదలైన అల్లు అర్జున్ vs జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ వార్

సోషల్ మీడియాలో కలిసి పోరాడిన వాళ్లే... ఇప్పుడు ఒకరిపై ఒకరు యుద్ధం చేస్తున్నారు. ఒకప్పుడు ఇతర హీరోల అభిమానులతో జరిగే ఫ్యాన్ వార్స్‌లో భుజం భుజం కలిపి నిలిచిన అల్లు అర్జున్, జూనియర్...