Switch to English

Allu Arjun: ‘అయిదేళ్ల పుష్ప జర్నీ అందరికీ ఎమోషన్..’ థాంక్స్ మీట్ లో అల్లు అర్జున్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,845FansLike
57,764FollowersFollow

Allu Arjun: ‘పుష్ప 2 ది రూల్’ ఘన విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం థ్యాంక్స్‌ మీట్‌ ఘనంగా జరిగింది. వేడుకలో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హీరో అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌ షీల్డులు బహుకరించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ

‘పుష్పను ప్రపంచవ్యాప్తంగా ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌. పోస్టర్‌లో నా ఫోటో చూసుకున్న ప్రతిసారీ.. నాపై టీమ్ చూపిన ప్రేమే కనిపించింది. 5నిముషాల నుంచి షూటింగ్ జరిగిన 5ఏళ్ల వరకూ టీమ్ ఎంతో కష్టపడ్డారు. పుష్ప-2 షూటింగ్‌ అయిపోయిందంటే ఎమోషనల్ అయ్యాను. నిర్మాతలు రవి, నవీన్‌, చెర్రీ వల్లే పుష్ప సాధ్యమైంది. మిలియన్ వ్యూస్ లో పాటలుండాలని భావిస్తే దేవిశ్రీప్రసాద్‌ బిలియన్స్‌ల్లో చూపించాడు. అంత ఎనర్జీ ఇచ్చాడు’.

పుష్పలో నా నటనకు ఎంతో పేరు రావడానికి కారణం సుకుమారే. సుకుమార్‌ సీన్‌ చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. పుష్ప ఓ ఎమోషన్‌. ఐదు ఏళ్లు సుకుమార్‌ ఏది చెబితే అది చేశాం. అందరికి జీవితాంతం గుర్తుండిపోతుంది. పుష్ప-3 ఏంటో తెలియదు కానీ ఓ అద్బుతంలా కనిపిస్తుంది. అందరికి హిట్‌ ఇచ్చేది దర్శకుడే. సుకుమార్ కు థ్యాంక్స్ చెప్పడం చిన్న మాట. సుకుమార్‌ మాత్రం సినిమా విజయంలో అందరికి క్రెడిట్‌ ఇస్తాడు. సినిమా సక్సెస్‌ను నా అభిమానులకు అంకితం చేస్తున్నా’నని అన్నారు.

సుకుమార్‌ .. ‘పుష్ప విజయంలో మైత్రీ మూవీస్ చెర్రీ పాత్ర కీలకమైంది. ఆయన సలహాతోనే పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కించా. రంగస్థలం నుంచి వరుస హిట్స్‌ రావడానికి మైత్రీ మూవీసే కారణం. ఈ విజయం వాళ్లదే. దేవి లేకుండా ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా సినిమా చేయలేను. నాపేరు సుకుమార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ అని చెప్పుకోవాలి. అల్లు అర్జున్‌ నాకు ఎంతో ఎనర్జీ ఇస్తాడు. ఆయనో అద్బుతం. నా దగ్గర సరైన కథ లేకుండానే ఓకే చెప్పాడు. పుష్ప సక్సెస్‌  క్రెడిట్‌ మొత్తం అల్లు అర్జున్‌దే. నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ గా తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. ఒకాయన అల్లు అర్జున్‌ను నటనలో ఎస్వీ రంగారావుతో పోల్చారంటే అర్ధం చేసుకోవచ్చ’ని అన్నారు.

నిర్మాత రవిశంకర్‌, నవీన్ మాట్లాడుతూ ”పుష్ప-2 సుకుమార్ విజన్‌ నుంచి వచ్చిన సక్సెస్‌ ఇది. అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు పూర్తి బలాన్నిచ్చారు. అంచనాలు మంచి కలెక్ట్‌ చేస్తుందని ఊహించినా.. ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని ఊహించలేదు. ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు హీరో, దర్శకుడికి థాంక్స్’ అని అన్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌..’ పుష్ప అనేది ఓ మ్యాజిక్‌. ఎన్ని మాటలు చెప్పినా చాలవు. ఈ మ్యాజిక్‌ కు కారణమైన హీరో, దర్శకుడు, మైత్రీ మూవీ అధినేతలకు కృతజ్ఞతలు. కష్టపడితే యూనివర్శ్‌ మనకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తుందనేందుకు పుష్ప సక్సెస్‌ నిదర్శనం. సుకుమార్‌ గారి విజన్‌ కు అల్లు అర్జున్‌ ప్రాణం పోశార’ని అన్నారు.

సినిమా

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

రాజకీయం

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: అలుపెరుగని చిరంజీవి కీర్తి.. అదొక ప్రవాహం

Chiranjeevi: ఎంత చెప్పుకున్నా.. ఎంతెంత చదివినా.. మరెంత తెలుసుకున్నా.. చిరంజీవి జీవితం నిత్యనూతనం. సినీ ప్రస్థానం, సమాజ సేవలో సాధించిన విజయాలు, సంపాదించిన కీర్తి, అందుకున్న పురస్కారాలు ఇందుకు నిదర్శనం. జీవిత సాఫల్య...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 21 మార్చి 2025

పంచాంగం తేదీ 21-03-2025, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ సప్తమి రా. 11.50 వరకు నక్షత్రం:...

అన్య మతస్తులైన కిరాయి మూకల్ని జనసేనపైకి ప్రయోగిస్తున్నదెవరు.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘సనాతన ధర్మ పరిరక్షణ’ కోసం నడుం బిగించడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. సనాతన ధర్మం అంటే, హిందువునైన తాను, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంతోపాటు, ఇతర మతాల్ని గౌరవించడం.. అని...

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...