Allu Arjun: ‘పుష్ప 2’ ప్రీమియర్ ప్రదర్శన రోజు హైదరాబాద్ సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా.. ఆమె 9ఏళ్ల కుమారుడు గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని.. మనసుల్ని కలచివేసే సంఘటనగా పేర్కొన్నారు. ఆ కుటుంబానికి తన వంతుగా రూ.25లక్షలు సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు.
‘పుష్ప ప్రీమియర్ కు మేము సంధ్య ధియేటర్ కు వెళ్లినప్పుడు బయట తొక్కిసలాట జరిగిందని.. ఒక మహిళ మృతి చెంది, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడని మరునాడు తెలిసింది. ఇది మా యూనిట్ మొత్తాన్ని తీవ్రంగా కలచివేసింది. ఎలా స్పందించాలో కూడా తెలీని పరిస్థితిలో ఉండిపోయాం. జరిగింది దురదృష్టకర ఘటన. మేము ఎంత చేసినా ఆమెను తీసుకురాలేము. నావంతుగా 25లక్షల సాయం అందిస్తున్నాను. వారి ఆసుపత్రి ఖర్చులు భరిస్తాను. వారికి అండగా ఉంటా’నంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
మరోవైపు ఘటనలో గాయపడ్డ బాలుడు నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Deeply heartbroken by the tragic incident at Sandhya Theatre. My heartfelt condolences go out to the grieving family during this unimaginably difficult time. I want to assure them they are not alone in this pain and will meet the family personally. While respecting their need for… pic.twitter.com/g3CSQftucz
— Allu Arjun (@alluarjun) December 6, 2024