పాన్ ఇండియా సినిమా .. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. పాన్ ఇండియా సినిమా అంటే .. ఒక భాషలో తెరకెక్కిస్తున్న చిత్రాన్ని మిగతా దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేయడం. బాహుబలి తో ఈ తరహా సినిమాలకు కొత్త ఉత్సాహం వచ్చింది. బాహుబలి తరువాత ఇప్పటికే చాలా సినిమాలు పాన్ ఇండియన్ సినిమాలుగా అవతరించాయి. లేటెస్ట్ గా విడుదలైన సాహో , సుదీప్ పహిల్వాన్, ఇప్పుడు సైరా ఇలా అన్నమాట. తాజాగా అల్లు అర్జున్ కూడా అలాంటి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం తెలుగు, మలయాళ భాషల్లో హీరోగా మంచి క్రేజ్ ఉన్న బన్నీ నెక్స్ట్ ఫోకస్ బాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మన తెలుగు హీరోలు .. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు అటు బాలీవుడ్ లోకూడా క్రేజ్ తెచ్చుకునే పనిలో ఉన్నారు. ప్రభాస్ అయితే ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా నిలబడ్డాడు. ఇప్పుడు అదే కోవలో అల్లు అర్జున్ ఫోకస్ పెట్టాడు.
Also Read: షాక్ : బన్నీ సినిమా ఆగిపోయిందా ?
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురం లో సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా బాలీవుడ్ లో చేయాలనీ ప్రయత్నాల్లో వేగం పెంచాడు. ఇప్పటికే ముంబై వెళ్లి .. అక్కడ పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు. తన దగ్గరికి వస్తున్న దర్శకులకు కూడా ఒక్క తెలుగు మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని కాదు హిందీ భాషను కూడా దృష్టిలో పెట్టుకుని కథలు సిద్ధం చేయమని చెప్పాడట. ఇప్పుడు అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ పై సీరియస్ గా ఉన్నాడని టాక్.
