Allu Arjun: హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్.. కారణమిదే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,455FansLike
57,764FollowersFollow

Allu Arjun: వ్యక్తిగత హక్కుల పరిరక్షణ విషయంలో మరో స్టార్ హీరో కోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్‌ ను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోరుతూ సివిల్ సూట్ పిటిషన్ దాఖలు చేయడం వార్తల్లో నిలిచింది. అల్లు అర్జున్ తరఫున న్యాయవాది స్వాతి సుకుమార్ కోర్టులో ఆయన తరపున వాదనలు వినిపిస్తూ.. ‘  కొన్ని సంస్థలు, వ్యక్తులు ఆయనకు సంబంధం లేకుండా అల్లు అర్జున్ ఇమేజ్‌ ను వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఫొటోలు క్రియేట్ చేస్తున్నారు.

వాయిస్‌ క్లోన్ చేసి అచ్చం ఆయనలా మాట్లాడే యాప్‌ లను సృష్టిస్తున్నారు. ఇటువంటి చర్యలు అడ్డుకోవాలి. ఇది తన బ్రాండ్ వాల్యూకు నష్ట’మని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం అల్లు అర్జున్ కు అనుకూలంగా ఆర్డర్ ఇస్తామని పేర్కొంది. అనుమతి లేకుండా సెలబ్రిటీల హోదా, వ్యక్తిత్వాన్ని వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించడం తప్ప’ని అభిప్రాయపడింది. అయితే.. తదుపరి విచారణలో దీనిపై స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశముంది. మొత్తంగా అల్లు అర్జున్ కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టులో తీర్పు వచ్చినట్టయింది. ఇటివలి కాలంలో డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు, వాయిస్ మార్ఫింగ్ ఎక్కువయింది. దీంతో సెలబ్రిటీల ఇమేజ్ కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

దీంతో ఇప్పటికే అనేకమయంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత హక్కులు కాపాడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా వారందరికీ అనుకూలంగానే తీర్పులు వచ్చాయి. ఇప్పుడు వీరి లిస్టులో అల్లు అర్జున్ కూడా చేరారు. కోర్టును ఆశ్రయించినవారిలో అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజినీకాంత్, మోహన్ లాల్, ఐశ్వర్యారాయ్, నాగార్జున, పవన్ కళ్యాణ్, అనిల్ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, శిల్పాశెట్టి వంటి స్టార్ నటీనటులు ఉన్నారు. కెరీర్ పరంగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’లో అల్లు అర్జున్ నటిస్తున్నారు. అంతర్జాతీయ ప్రాజెక్టుగా సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన అల్లు అర్జున్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీని తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు అల్లు అర్జున్.

సినిమా

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు...

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రీషూట్స్..! ఏం జరుగుతుందో క్లారిటీ...

The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే చాలా భాగం తెరకెక్కిన సినిమా ఇంకా కొంత భాగం...

రాజకీయం

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులు తెచ్చిన చంద్రబాబు.. అమరావతిలో EY ఎంట్రీ!

అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఐటీ మరియు ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజన్‌కు మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్, ఐటీ సంస్థ Ernst &...

ఎక్కువ చదివినవి

యువ ప్రేక్షకుల బంగారు కొండ.. ఈ విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: సాధారణ యువకుడు.. సినీరంగంలో రాణించాలని వచ్చాడు. తన ఫోటోలతో స్టూడియోలకు వెళ్ళాడు. ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఫోటోలు ఇచ్చాడు. మొత్తంగా వెండితెరపై కనిపించాడు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు వేశాడు. నిర్మాత–దర్శకులను...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

“హలో ఇండియా!” పేరుతో చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu...

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్...

కష్టాల నుంచి సీఎం కుర్చీ వరకు: తమిళనాడు సీఎం విజయ్ విజయ ప్రయాణం

విజయం అనేది ఒక్కరోజులో వచ్చే విషయం కాదు. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు, పోరాటాలు దాగి ఉంటాయి. ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ జీవిత...