సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా షూటింగ్ ను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఇప్పటికే దుబాయ్ లో నెల రోజుల పాటు భారీ షెడ్యూల్ ను చిత్రీకరించారు. హైదరాబాద్ లో కూడా కొన్ని రోజుల షూటింగ్ జరిగింది కానీ కరోనా కారణంగా నిలిచిపోయింది.
వచ్చే నెలలో సర్కారు వారి పాట షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే సర్కారు వారి పాటలో విలన్ ఎవరు అన్న ప్రశ్న ఇంకా కొనసాగుతోంది. సుదీప్, ఉపేంద్ర, అరవింద్ స్వామి వంటి పేర్లు వినిపించాయి కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ షెడ్యూల్ లో అర్జున్ కూడా పాల్గొంటాడని సమాచారం. మహేష్ ను వెంటాడే క్రిమినల్ పోలీస్ గా అర్జున్ కనిపిస్తాడట.
356546 80119In todays news reporting clever journalists work their very own slant into a story. Bloggers use it promote their works and many just use it for fun or to stay in touch with pals far away. 548608