Switch to English

తెరపైకి మల్ల యోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్.. అల్లు అరవింద్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,840FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ మల్లయోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన జీవిత చరిత్రను వెబ్ సిరీస్ గా కానీ సినిమాగా కానీ ఎప్పటికైనా తెరమీదకి తీసుకురావాలని కోరుకుంటున్నాట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. శాకాహారి అయిన రామ్మూర్తి నాయుడు తన దేహదారుద్యంతో ఎన్నో అద్భుతాలు సృష్టించారని కొనియాడారు. శ్రీకాకుళం లోని కోడి రామ్మూర్తి స్టేడియం లో జరిగిన “తండేల్” సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“శ్రీకాకుళానికి చెందిన మత్స్యకారుల జీవితాలను “తండేల్” రూపంలో తెరపై ఆవిష్కరించాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతి అయిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి జీవితాన్ని కూడా తెరకెక్కిస్తాం. వెబ్ సిరీస్ గా గాని సినిమాగా కానీ రూపొందిస్తాం. ఇప్పటికే దీనిపై కొంత స్టడీ కూడా చేశాం” అని అల్లు అరవింద్ తెలిపారు. అయితే కోడి రామ్మూర్తి బయోపిక్ పై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఈయన బయోపిక్ లో నటించనున్నట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి. బుచ్చి బాబు సాన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు అల్లు అరవింద్ కూడా రామ్మూర్తి నాయుడు బయోపిక్ ప్రస్తావన తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎవరీ రామ్మూర్తి నాయుడు?

శ్రీకాకుళంలోని వీరఘట్టం లో జన్మించిన కోడి రామ్మూర్తి నాయుడు 20 వ శతాబ్దానికి చెందిన ప్రముఖ మల్ల యోధుడు. మల్ల విద్యలో ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఏనుగుని తన చాతిపై ఎక్కించుకుని ఐదు నిమిషాల పాటు నిలిపారు. రైలు ఇంజన్ ను ఒంటి చేత్తో ఆపి అప్పట్లో సంచలనంగా మారారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ పాలకులైన కింగ్ జార్జ్, మేరీ క్వీన్ లో ఆయన బల ప్రదర్శనకు అబ్బురపడి “ఇండియన్ హెర్క్యులస్” అనే బిరుదు తో ఆయనను సత్కరించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను కలియుగ భీముడుగా అభివర్ణించేవారు.

సినిమా

అల్లు అర్జున్ డ్యుయల్ రోల్..?

పుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టాడని తెలుస్తుంది. త్రివిక్రంతో చేయాల్సిన భారీ...

బ్లాక్ డ్రెస్ లో ‘బేబీ’ అదుర్స్..!

బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాతో రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న...

‘భైరవి’ పాత్ర చేయడం నా అదృష్టం : తమన్నా

'ఓదెల రైల్వే స్టేషన్‌'కి సీక్వెల్‌గా రూపొందిన 'ఓదెల 2' ఏప్రిల్‌ 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్‌,...

స్టైలిష్ లుక్ లో మహేశ్, సితార.. ఈ స్టిల్స్ చూశారా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఎస్ ఎస్ ఎంబీ29 సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు. ఎంత...

నిన్ను నువ్వు తిట్టుకుంటే సినిమా హిట్టవుతుందా ‘రాబిన్ హుడ్’.?

మార్చి 28న నితిన్ కొత్త సినిమా ‘రాబిన్ హుడ్’ విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లేమో కాస్తంత ఇన్నోవేటివ్‌గానే డిజైన్ చేశారు కూడా.! శ్రీలీల హీరోయిన్. వెంకీ...

రాజకీయం

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని...

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

బూతులు లేవు, బాధ్యతలు మాత్రమే.! కూటమి సర్కారుకి జన నీరాజనం.!

అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని...

కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ ప్రకంపనలు..

కర్ణాటక రాజకీయాలను హనీట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. కేవలం అధికార పార్టీనే కాకుండా అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కర్ణాటక సహకార మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా...

ఎక్కువ చదివినవి

బ్లాక్ డ్రెస్ లో ‘బేబీ’ అదుర్స్..!

బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాతో రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న జాక్ సినిమాపై వైష్ణవి చైతన్య చాలా...

ఇండియన్‌ సినిమా క్వీన్‌ రష్మిక

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న 'ఛావా' సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. యేసుబాయి పాత్రలో రష్మిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఛావా సినిమా సూపర్ హిట్ కావడంతో...

సాక్షి పత్రిక దర్శకత్వంలోనే పోసాని బూతులు.!

అవినీతి విష పుత్రికగా సాక్షి పత్రిక గురించి పాత్రికేయ వర్గాలు అభివర్ణిస్తుంటాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన రాజకీయ కర పత్రిక...

స్టైలిష్ లుక్ లో మహేశ్, సితార.. ఈ స్టిల్స్ చూశారా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఎస్ ఎస్ ఎంబీ29 సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు. ఎంత బిజీగా ఉన్నా సరే గ్యాప్ దొరికితే...

ప్రజల ఆస్తి వైఎస్సార్.! కానీ, వైఎస్సార్ ఆస్తులు ప్రజలవి కావు.! అంతేనా.?

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అపారమైన ప్రేమ పుట్టుకొచ్చేసింది. వైఎస్సార్ అంటే, ప్రజల ఆస్తి.. అని సెలవిచ్చారామె. తాడిగడప మునిసిపాలిటీ పేరు నుంచి వైఎస్సార్...