ఏపీలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అంతకు ముందు వారి గురించి పట్టించుకున్న వారు ఎవరూ లేరు. కానీ టీడీపీ హయంలో నుంచే చంద్రబాబు వారి గురించి ఆలోచిస్తూ వస్తున్నారు. వారిని వేటకు నిషేధించిన టైమ్ లో ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులు పడేవారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు 2014-19 హయాంలో మొదటిసారి మత్స్యకార భృతిని తీసుకొచ్చారు. టీడీపీ హయాంలో రూ.788 కోట్లను మత్స్యకారులకు ఆర్థిక సాయం కింద అందజేశారు. అంతే కాకుండా వేటకు వెళ్తే లీజరు డీజిల్ మీద రూ.9 సబ్సిడీని కూడా అందించారు. ఇవే కాకుండా వలలు, బోట్లు, ఐస్ బాక్సులను అందజేసి అండగా నిలిచారు. వారి పిల్లల కోసం మత్స్యకార రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు.
టీడీపీ హయాంలోనే ఇలా వారిని ఆదుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు నిషేద భృతిని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచారు సీఎం చంద్రబాబు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 68396 మందికి నెలనెలా పింఛన్లు కూడా అందజేస్తున్నారు. వేట సమయంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్ గ్రేషియాను కూడా అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నవే కాకుండా కొత్తగా 9 ఫిషింగ్ హార్బర్లు, ఏడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా నిర్మించారు. త్వరలోనే 4484 బోట్లలో టూ వే కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా అమలు చేయబోతోంది కూటమి ప్రభుత్వం. ఇలా మత్స్యకారులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంది. సీఎం చంద్రబాబు వారి కోసం ఆనాడు, ఈనాడు ముందుగా ఆలోచిస్తున్నారు. అమలు చేస్తున్నారు.

