సూపర్ స్టార్ మహేష్ బాబు తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల చాలా సినిమాల రూపురేఖలు మారిపోతున్నాయి. కొన్ని కాంబినేషన్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. కుదరవు అనుకున్నవి సెట్ అయ్యేలా కనిపిస్తున్నాయి.
ఇంతకీ మహేష్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో తెలుసా? ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన వంశీ పైడిపల్లితో సినిమాను మహేష్ రద్దు చేసుకోవడమే. ఈ వార్త దాదాపు నిజమేనని తేలింది. దీంతో పాటు మరో వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. అదే గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో సినిమా చేయడానికి మహేష్ సముఖంగా ఉన్నాడు.
ఇదివరకే వీరి కాంబినేషన్ లో సినిమా సెట్ అవ్వాలి కానీ అప్పుడు కుదర్లేదు. ఇప్పుడు కుదిరేలా ఉంది. పరశురామ్, మహేష్ తో సినిమా చేస్తే నాగ చైతన్యతో సినిమా వాయిదా పడుతుంది. అయితే మహేష్ సినిమా విడుదలయ్యాక చైతూతో మళ్ళీ సినిమా చేస్తాడా అంటే డౌటే. సో ఆ సినిమా క్యాన్సిల్ అనుకోవచ్చు.
దీంతో ప్రస్తుతం చేస్తున్న లవ్ స్టోరీ తర్వాత చైతూ ఖాళీనే. నాగ చైతన్య ఫ్రీ అవ్వడంతో తనతో సినిమా చేయడానికి మొదట ప్రయత్నించి డేట్లు లేని కారణంగా వెనక్కి తగ్గిన అజయ్ భూపతి ఇప్పుడు మళ్ళీ చైతన్యను కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నాడు. మహా సముద్రం టైటిల్ ఉన్న ఈ సినిమాలో శర్వానంద్ ఇప్పటికే ఒక హీరోగా ఫిక్స్ అవ్వగా, నాగ చైతన్యను కూడా తీసుకోవాలనుకుంటున్నాడు దర్శకుడు.
చైతూ కనుక ఈ సినిమాను ఓకే చేస్తే ఈ చిత్రం నుండి వాకౌట్ చేసిన సమంతను తిరిగి ఒప్పించడం పెద్ద కష్టమేమి కాబోదు. సో మహేష్ వల్ల ఇప్పుడు కాంబినేషన్స్ మారిపోతున్నాయన్నమాట.
78542 248498Some really superb info , Sword lily I found this. 244244
862152 61056Its rare knowledgeable folks within this subject, nevertheless, you seem like theres far more youre talking about! Thanks 586869
175532 981394of course like your web-site however you want to check the spelling on quite some of your posts. A number of them are rife with spelling issues and I to locate it quite bothersome to inform the reality nonetheless Ill surely come back once again. 940332