అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో చిన్నామె రమ్య మోక్ష కంచర్ల అంటే తెలియనే వారే ఉండరు. సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తర్వాత ఆమె గురించి ఎక్కువ మందికి తెలిసింది. పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా ఎక్కువ మందికి రీచ్ అయితే ఫాలోయింగ్ పెరిగినట్టే అంటుంది రమ్య. అయితే ఇప్పుడు ఆమె అశ్విన్ బాబు హీరోగా చేసిన వచ్చినవాడు గౌతమ్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో కనిపించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా అటువైపు తిరిగిపోయింది.
తాను ఇండస్ట్రీలో నటిస్తున్నాను అని రమ్య ఎప్పుడో చెప్పింది. రెండు సినిమాల్లో చేశానని.. అందులో మేకప్ కూడా వేసుకోలేదని చెప్పింది. ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ వచ్చిన వాడు గౌతమ్. ఈ మూవీ టీజర్ లాంచ్ నిన్న హైదరాబాద్ లో చేశారు. ఈ మూవీ హీరోయిన్ రియా సుమన్ పక్కనే రమ్య మోక్ష కనిపించింది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు కూడా. ఈ మూవీలో ఆమె నటించిందని తెలుస్తోంది. దీనిపై ఆమె ఏమీ స్పందించలేదు. కానీ పికిల్స్ కాంట్రవర్సీ నుంచి ఇప్పుడు ఇండస్ట్రీలో సెలబ్రిటీ మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫాలోవర్లు.
