వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ సభలో మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులపై పరోక్షంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ‘ఆ రంగారావు.. అక్కినేని, తొక్కినేని..’ అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో అక్కినేని నాగేశ్వరరావు మనవళ్లు, నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు.
‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముదు బిడ్డలు. వారిని అగౌరపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం..’ అని ఉన్న ప్రకటనను ట్వీట్ చేశారు. ప్రకటనలో ఎక్కడా బాలకృష్ణ పేరు, ఎటువంటి పరుష పదజాలం లేకుండా చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై బాలకృష్ణ స్పందిస్తారేమో చూడాలి.
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023
452020 934965 Spot on with this write-up, I truly feel this internet site needs considerably more consideration. Ill probably be once more to read a lot a lot more, thanks for that info. 983343
285937 385361bathroom towels really should be maintained with a excellent fabric conditioner so that they will last longer:: 807711