సరైన హిట్ లేక ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో అక్కినేని అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ తో కలిసి చేస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఇటీవలే విడుదల చేసిన అఖిల్, పూజ హెగ్డేల ఫస్ట్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కరోనా అనేది ప్రపంచాన్ని కమ్మేయకుండా ఉండి ఉంటే అఖిల్ టీం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉండేది. కానీ కరోనా వల్ల అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.
అఖిల్ మాత్రం ఈ కరోనా క్రియేట్ చేసిన లాక్ డౌన్ వలన తన తప్పులని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడట. ‘ ఈ లాక్ డౌన్ టైంలో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి నేను నటుడు అవ్వాలని ఇన్స్పైర్ చేసిన సినిమాలు చూస్తూ బేసిక్స్ గుర్తు చేసుకుంటున్నా. గతంలో బిజీ వల్ల కుదరడం లేదు, కానీ ఇప్పుడు నా మైండ్ ని మరియు బాడీని పర్ఫెక్ట్ గా ట్రైన్ చేసుకుంటున్నా. లాక్ డౌన్ వలన నేను ఎంత యంగ్ అయినా అనవసరం ఎందుకంటే ప్రపంచంలో ఉన్న టైం అంతా నాది కాదు. సో చాలా హార్డ్ వర్క్ చేయాలనిపించింది. అమ్మ, నాన్న కూడా వాళ్ళ పనుల్లో ఎప్పుడూ బిజీ. చిన్నప్పటి నుంచీ నాకు వాళ్ళతో సరైన టైం స్పెండ్ చేసే ఛాన్స్ రాలేదు. కానీ ఇప్పుడు హాయిగా వాళ్లతో గడుపుతూ, వాళ్ళకి బాగా దగ్గరయ్యానని’ అఖిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మరి లాక్ డౌన్ వల్ల నేర్చుకున్న పాఠాలతో అఖిల్ ఇకపైనన్నా స్పీడ్ గా, హిట్ కొట్టే సినిమాలు చేస్తారేమో చూడాలి.
805547 151033I conceive this web web site holds some real superb info for everybody : D. 871736
53703 71502Very good style and style and great topic matter, extremely little else we want : D. 638193