Switch to English

“మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్రప్రదేశ్ నా ఆత్మభూమి”: బాలకృష్ణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,203FansLike
57,764FollowersFollow

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5, 2025న 2D, 3D ఫార్మాట్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం, టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

చిత్ర బృందం చెన్నైలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో బాలకృష్ణ మాట్లాడుతూ భావోద్వేగంగా స్పందించారు.

“చెన్నైలో పుట్టినందుకు ఇది నా ఇల్లులా అనిపిస్తుంది. మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్రప్రదేశ్ నా ఆత్మభూమి” అని ఆయన అన్నారు.

‘అఖండ 2’ గురించి మాట్లాడుతూ—
“ఈ చిత్రాన్ని 130 రోజుల్లో, వివిధ దేశాల్లో అద్భుతంగా చిత్రీకరించాం. దేవుని దయ లేకుండా ఇలాంటి సినిమా సాధ్యం కాదు. సనాతన హైందవ ధర్మం చెప్పిన ధర్మం కోసం జీవించాలి, సత్యం కోసం పోరాడాలి, అన్యాయం ముందు తలవంచకూడదు అనే సందేశం ఈ చిత్రంలో కనిపిస్తుంది. భవిష్యత్ తరాలు సనాతన ధర్మం గురించి ఈ సినిమాతో నేర్చుకుంటాయి. ఇది ఒక ఎన్సైక్లోపీడియా లాంటి చిత్రం” అని చెప్పారు.

తన కెరీర్‌పై మాట్లాడుతూ—
“ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అవుతున్నా, ఇంకా హీరోగా కొనసాగడం నా తల్లితండ్రులు, అభిమానుల ఆశీస్సు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్— అన్నీ హిట్ . ‘అఖండ 2’ కూడా ఆ విజయయాత్రలో చేరుతుంది” అని ధైర్యంగా ప్రకటించారు.

కరోనా సమయంలో ‘అఖండ’ చేసిన కలకలం గురించి ప్రస్తావిస్తూ—
“ఆ సమయంలో భయపడకుండా విడుదలై ఘన విజయాన్ని సాధించిన మొదటి భారతీయ చిత్రం ‘అఖండ’. ఆ తర్వాతే మిగతా సినిమాలకు దారి తీయబడింది. బోయపాటి – మా కాంబినేషన్ సింహ, లెజెండ్, అఖండ— అన్నీ బ్లాక్ బస్టర్స్ . ఈ సినిమాతో కూడా అదే మాయ కొనసాగుతుంది” అన్నారు.

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ—
“‘అఖండ’ రీజినల్ సినిమా కాదు, ఇండియన్ సినిమా. అదే రీతిగా ‘అఖండ 2’ భారతదేశ ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రం ఆడియన్స్‌ను కమర్షియల్‌గా ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. పరమశివుడు స్వయంగా వచ్చి దేశం, ధర్మం, దైవం, వేదం గురించి ఒక పవిత్రమైన సందేశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ సందేశాన్ని పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా చెప్పాం” అని తెలిపారు.

ప్రెస్ మీట్ తర్వాత సినిమా పై హైప్ మరింత పెరిగింది. డిసెంబర్ 5న ప్రేక్షకులు ‘అఖండ 2: తాండవం’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సినిమా

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్.. యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ప్రభాస్ నిమ్మల కొత్త...

సంక్రాంతి పండుగ కానుకగా దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం ఈరోజు (జనవరి 16) అధికారికంగా విడుదల...

సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’

సంక్రాంతి పండుగ సీజన్‌లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. విడుదలైన కేవలం నాలుగు...

CHIRANJEEVI: చిరంజీవి క్రేజ్, రేంజ్ ఏంటో చూస్తున్న ‘Gen Z’

CHIRANJEEVI: ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా..., నువ్వో చిరంజీవి మరి.., చిరంజీవిలా ఆ ఫోజేంటేహే’.. ఇదీ 80, 90 దశకాల్లో చిరంజీవి హవా. చెప్పాలంటే రాజకీయాల్లోకి వెళ్లే...

రాజకీయం

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు...

ఎక్కువ చదివినవి

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

సంక్రాంతికి నవ్వుల రాజు వస్తున్నాడు!

సంక్రాంతి పండుగ సందడి మధ్య తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న అసలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’. వరుస విజయాలతో స్టార్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ...

పవన్ కళ్యాణ్ కు  ప్రధాని మోదీ ప్రశంసలు, కృతజ్ఞతలు చెప్పిన పవన్

జపనీస్ కత్తిసాము యుద్ధకళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను...

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్ ఇస్తా: మీనాక్షి చౌదరి

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్‌లో మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించనుంది....