Switch to English

వచ్చేస్తున్నాడు: అఖండ 2 రిలీజ్ కి మార్గం క్లియర్‌… కానీ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,125FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2కి సంబంధించిన రిలీజ్ డ్రామా చివరకు కీలక మలుపు తీసుకుంది. మద్రాస్ హైకోర్టు రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకున్నట్లు తెలిసింది. ఈరోస్ సంస్థతో ఉన్న ఆర్థిక విభేదాల కారణంగా డిసెంబర్ 5న జరగాల్సిన గ్రాండ్ రిలీజ్ ఒక్కసారిగా రద్దు కావడంతో అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అఖండ 2 రిలీజ్ అనూహ్యంగా వాయిదాపడటంతో మొత్తం ప్లానింగ్ గందరగోళంలో పడింది.

ఇక సమస్యను పరిష్కరించేందుకు 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ గత కొన్ని రోజులు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. చర్చలు, ఒప్పందాలు, న్యాయపరమైన ప్రక్రియలన్నీ పూర్తి కావడంతో కోర్టు ఇక రిలీజ్‌కు అడ్డంకులేదని స్పష్టంచేయడంతో .. డిసెంబర్ 12నే సినిమాను విడుదల చేసేందుకు టీమ్ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అభిమానుల డిమాండ్ కూడా అదే దిశగా ఉంది.

అయితే రిలీజ్‌కు మార్గం సిద్ధమైనా కొత్త సమస్య ఓవర్సీస్ మార్కెట్లో తలెత్తింది. మొదట రిలీజ్ ప్లాన్‌ చేసిన తేదీ వాయిదాపడటంతో అక్కడి థియేటర్ లిస్టింగ్స్ మొత్తం రద్దయ్యాయి. ఇప్పుడు కొత్త తేదీ ప్రకారం కేవలం రెండు రోజుల్లోనే మళ్లీ స్క్రీన్లు బుక్ చేసుకోవాలి. ఇది డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద కష్టంగా మారింది. ఓవర్సీస్ షోలు సమయానికి మొదలవుతాయా అన్న అనుమానం ఇంకా కొనసాగుతూనే ఉంది.

దేశంలో అయితే రిలీజ్‌ అనుకున్నట్టుగానే జరగేందుకు అడ్డంకులు లేవన్నట్లే. టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మళ్లీ అప్లికేషన్లు సమర్పించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్‌లు పెట్టే యోచన కూడా ఉంది. మొత్తం మీద అఖండ 2 చివరికి ప్రేక్షకుల ముందుకు రాబోతోందనే నమ్మకం బలపడింది కానీ ఓవర్సీస్ మార్కెట్‌లో ఇంకా పజిల్‌ అదే ఉంది.

సినిమా

ప్రెగ్నెన్సీ రూమర్లకు ఫుల్‌స్టాప్‌: శోభితా లేటెస్ట్‌ లుక్‌తో క్లారిటీ

అక్కినేని కుటుంబంలో వారసులు రాబోతున్నారంటూ, హీరోయిన్‌ శోభితా దూళిపాళ ప్రెగ్నెంట్‌గా ఉందనే వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యాయి. ఈ రూమర్లపై ఎలాంటి...

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే...

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’:...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్,...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

రాజకీయం

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

ఎక్కువ చదివినవి

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్ లు.. ఇలా క్రేజీ కాంబినేషన్లలో సినిమాలంటే...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్ గుమ్మ

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా కనిపిస్తాయి. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దీప్తి,...

సాక్షిపై న్యాయ పోరాటం నుంచి ఎకనామిక్ విజన్ వరకు: లోకేష్ స్పష్టీకరణ

విశాఖపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ, పట్టుదలతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని...

ప్రభుత్వ స్థిరత్వమే పెట్టుబడులకు బలం: పూణేలో లోకేష్ స్పష్టం

పూణే: ప్రభుత్వాల కొనసాగింపే రాష్ట్రాభివృద్ధికి కీలకమని, పాలసీల్లో స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర పూణేలో గోఖలే ఇన్‌స్టిట్యూట్...

పంతం నెగ్గింది.. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా ఆమోదం

నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇచ్చిన రాజీనామాను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధికారికంగా ఆమోదించారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఈ...