కర్నూలు జిల్లా చాగలమర్రి కి చెందిన అక్బర్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో వైకాపా ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైకాపా కార్యకర్త అయిన అక్బర్ కుటుంబం కు చెందిన భూమిని వైకాపా నాయకుడు కబ్జా చేశాడు. దాంతో అతడి నుండి తన భూమికి ఇప్పించాల్సిందిగా కోరాడు. కాని అతడికి న్యాయం దక్కలేదు.
పోలీసులు కూడా అక్బర్ కుటుంబంను మానసికంగా హింసించడంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆత్మహత్య యత్నం చేసిన అక్బర్ కుటుంబం సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆ సమయంలో అక్బర్ ను వెంటనే కాపాడేందుకు కేరళ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం వారి పరిస్థితి స్థిమితంగా ఉందని వైధ్యులు చెబుతున్నారు. ఈ విషయమై సీఎం జగన్ స్పందించాల్సిందిగా కోరుకుంటున్నారు.