ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా నష్టాల ఊబిలో చిక్కుకు పోయింది. నలబై వేల కోట్లకు పైగా అప్పులు ఎయిర్ ఇండియాకు అవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియా నుండి నూరు శాతం వాటాను ఉపసంహరించుకునేందుకు సిద్దం అయ్యింది. అందుకోసం బిడ్ లను దాఖలు చేసింది. తద్వారా ఎయిర్ ఇండియాను కొత్త యాజమాన్యంకు అప్పగించేందుకు సిద్దం అయ్యింది. ఎయిర్ ఇండియాను దక్కించుకునేందుకు రెండు సంస్థలు పోటీ పడగా అందులో టాటా సన్స్ గ్రూప్ కు ఎయిర్ ఇండియా దక్కింది.
టాటా వారు వేసిన బిడ్ కు గాను ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయబోతున్నట్లున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టాటా వారికి ఎయిర్ ఇండియా బిడ్ దక్కినా కూడా కేంద్రం మాత్రం మరో రెండు వారాల తర్వాతే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు వారాల్లో కొన్ని డాక్యుమెంటేషన్ పక్రియ ఉంటుందట. ఆ తర్వాత కాని టాటాలు ఎయిర్ ఇండియాను దక్కించుకుంటారని సమాచారం అందుతోంది.
250605 93037Music began playing anytime I opened this site, so irritating! 191900
328280 138459 Its hard to locate knowledgeable folks on this topic, but you sound like you know what you are talking about! Thanks 552741