Switch to English

ఓటీటీ రిలీజ్ : నవదీప్ ‘రన్’ మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

నటీనటులు: నవదీప్, పూజిత పొన్నాడ, వెంకట్, అమిత్, షఫీ, మధు నందన్, భానుశ్రీ, కిరీటి తదితరులు.
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, క్రిష్ జాగర్లమూడి
దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా
రన్ టైం: 86 నిముషాలు
విడుదల తేదీ: మే 29, 2020
ఓటీటీ ప్లాట్ ఫాం: ఆహా

ఇటీవలి కాలంలో చిన్న నిర్మాతలు, దర్శకులకు ఓటీటీ వేదికలు ప్రత్యామ్నాయాలుగా మారాయి. కొందరైతే థియేటర్లు లేకపోవటంతో ఓటీటీ విడుదలకు వెళ్తుంటే మరికొందరు వెబ్ ప్లాట్ ఫాం కోసమే సినిమాలు తీస్తున్నారు. అదే కోవలో లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో నవదీప్ నటించిన ‘రన్’ సినిమా ఆహా ఒరిజినల్ పేరుతో శుక్రవారం ఓటీటీ వేదిక ‘ఆహా’ ద్వారా విడుదలైంది. ఒక హత్య..ఆరుగురు అనుమానితులు అంటూ ట్రైలర్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ థ్రిల్లర్ చిత్రం వీక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

శృతి(పూజిత పొన్నాడ) తొలి సన్నివేశంలోనే సందీప్ (నవదీప్)తో ప్రేమలో ఉండడంతో ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. వారి అన్యోన్యమైన ప్రేమ, రొమాన్స్ తర్వాత శృతి చనిపోతుంది. ఆత్మహత్యా.? హత్యా.? అంటూ పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. పోలీసులు సందీప్ ను అనుమానించటంతో సందీప్ వారి నుండి పరిగెడుతూ హంతకుడి కోసం వెతుకుతూ ఉంటాడు. అసలు హంతకుడు ఎవరు.? శృతిది అసలు హత్యా.? ఆత్మహత్యా.? అనేది తెలుసుకోవాలంటే ‘రన్’ చూడాల్సిందే.

తెర మీద స్టార్స్:

నవదీప్ నుండి ఇలాంటి నటన, సినిమా చూస్తామని ఎవ్వరూ ఊహించరు. వెంకట్, అమిత్, షఫీ, మధు నందన్, భానుశ్రీ, కిరీటి ఇలా ఎందరున్నా పాపం వీక్షకుడిని, మా వల్ల కాదు ఈ మూవీ చూడడం అంటూ మూవీ నుంచి ఎగ్జిట్ అవ్వడాన్ని ఆపలేకపోయారు.

తెరవెనుక టాలెంట్:

మేకింగ్ పరంగా ఇటీవలి కాలంలో ఎటువంటి అనుభవం లేని వారు కూడా షార్ట్ ఫిలింలే ఇంకా బాగా తీస్తున్నారు. కథ, కథనాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. సంగీతం అయితే సినిమా మూడ్ కి అసలు సింక్ అవ్వకుండా ఏదో డీజే వాయించినట్లుగా, సీరియల్స్ కి ట్రాక్స్ వేసినట్లుగా అనిపిస్తుంది. సినిమాకు హైలైట్ ఏదైనా ఉంది అంటే అది సినిమా యొక్క నిడివి మాత్రమే. అర్ధవంతమైన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నిర్మాణ సంస్థ నుండి ఇలాంటి సినిమాను ఊహించటం కష్టమే.

విశ్లేషణ:

హీరో హీరోయిన్లు కలవటం, ప్రేమించుకోవటం, పెళ్ళి చేసుకోవటం, అంతలోనే హీరో లేదా హీరోయిన్ చనిపోవటం ఆ తర్వాత హంతకుడు ఎవరు అనుకుంటూ బయలుదేరటం లాంటి కథలు ఎన్ని వచ్చినా ఎంచుకున్న పాయింట్ ను పకడ్బందీ కథనంతో వీక్షకుడిని కూర్చోపెట్టటంలోనే దర్శకుడి ప్రతిభ దాగి ఉంటుంది. తొలి పది నిముషాల్లో హీరో హీరోయిన్ల లవ్వూ, లస్కూ, మసాలా పాట చూపించిన దర్శకుడు తర్వాత ఏదైనా ఇంటరెస్టింగ్ గా చూపిస్తాడేమో అని ఆశించిన సాధారణ సినిమా వీక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. 86 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాలో మొదటి 70 నిముషాలను వీక్షకుడి సహనాన్ని వాడుకోవటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. టీవీ సీరియల్ కు ఏ మాత్రం తీసిపోకుండా కథను, కథాగమనాన్ని నడిపిన దర్శకుడు చివరిలో ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో అనుకుంటే ‘’వాహ్! వాట్ ఏ క్లాసిక్ థ్రిల్లర్’’ అంటూ ఫ్రస్టేషన్లో వీక్షకుడితో అనిపించేసుకున్నాడు.

పంచ్ లైన్: “రన్ విత్ యువర్ ఓన్ రిస్క్”

తెలుగు బులిటెన్ రేటింగ్: 1/5

సూర్య ప్రకాష్ వేద

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...