రాబోయే రోజుల్లో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారు చాలా తక్కువ అవుతారు. బిజీ లైఫ్ లేదంటే టికెట్ల రేట్ల కారణంగా సినిమాకు వెళ్లాలి అంటేనే కష్టం అయ్యే రోజులు రాబోతున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు పదే పదే చెబుతున్నాడు. థియేటర్లకు కాలం చెల్లిందని, వాటిని ఫంక్షన్ హాల్స్గా మార్చాల్సిందే అంటూ ఆయన గతంలో మాట్లాడిన విషయం తెల్సిందే. హాలీవుడ్కే పరిమితం అయిన వెబ్ సిరీస్లు మెల్ల మెల్లగా ఇండియాకు వచ్చాయి ఇప్పుడు తెలుగులో దమ్ము రేపుతున్నాయి.
గత ఏడాది వరకు తెలుగులో వెబ్ సిరిస్లు అంటే చేతివేళ్ల మీద లెక్కించవచ్చు. కాని ఇప్పుడు వరుసగా వెబ్ సిరీస్లు వస్తున్నాయి. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ను అల్లు అరవింద్ ప్రారంభించిన తర్వాత అంతా మారిపోయింది. తెలుగులో వెబ్ సిరీస్ల ట్రెండ్ మొదలైంది. ప్రస్తుతం వరుసగా వెబ్ సిరీస్లు వస్తున్నాయి. పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ కూడా వెబ్ సిరీస్ను నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు.
ఆహాలో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న మస్తీస్ వెబ్ సిరీస్ను క్రిష్ నిర్మించాడు. నవదీప్ కీలక పాత్రలో నటించగా భిందు మాధవి.. చాందిని చౌదరిలు నటించారు. ఇంకా పలు వెబ్ సిరీస్లు కూడా ఈ క్రమంలోనే రాబోతున్నాయి. జీ5లో చదరంగం అనే వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. మంచు విష్ణు నిర్మించిన ఆ వెబ్ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
సినిమాల స్థాయిలో ప్రమోట్ చేస్తూ జనాలను అలరిస్తు ఆకట్టుకుంటున్నారు. రెండు మూడు సంవత్సరాల్లో సినిమాల కంటే వెబ్ సిరీస్లు ఎక్కువ అవుతాయి. చిన్న బడ్జెట్ సినిమాలు అనేవి ఉండవని, అన్ని వెబ్ సిరీస్లే అవుతాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల కంటే వెబ్ సిరీస్ల వల్ల ప్రయోజనాలు ఎక్కువ.. ఫలితం ఎక్కువ అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.
735476 255977Extremely usefull blog. i will follow this weblog. keep up the very good function. 523137
166311 343532Outstanding post, I conceive men and women really should larn a lot from this web website its actually user genial . 735752