ఇండియాలో న్యాయం జరగడానికి కాస్త సమయం పడుతుందని అంటారు, అయితే కొన్నిసార్లు ఆ సమయం మరి ఎక్కువ పడుతుంది. 100 రూపాయల లంచం కేసులో తుది తీర్పు రావడానికి 32 సంవత్సరాలు పట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 32 సంవత్సరాల క్రితం రామ్ నారాయణ అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వంద రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
అతడు ఉద్యోగం నుండి రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ కేసు ఆయన్ని వదిలిపెట్టలేదు. రైల్వే హాస్పిటల్ స్టాఫ్ అయిన రామ్ నారాయణ ఒక తోటి ఉద్యోగికి మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అప్పట్లో 150 రూపాయల లంచం డిమాండ్ చేశారు, దాంతో రామ్ నారాయణ ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఆ కేసు విషయమై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు ఫిబ్రవరి 2వ తారీఖున తుది తీర్పును వెలువరించింది. 80 సంవత్సరాల ఆ దోషికి సంవత్సరం పాటు కారాగార శిక్ష విధించడం తో పాటు 15వేల రూపాయల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఈ వయసులో తాను జైలుకు వెళ్లలేనంటూ కోర్టుకు రామ్ నారాయణ విజ్ఞప్తి చేసినా కూడా జైలు జీవితాన్ని అనుభవించాల్సిందే అంటూ న్యాయమూర్తి తుది తీర్పును వెలువరించారు.
732672 658497However, what in regards to the conclusion? Are you sure about the source? 141869