ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ అనేక డేరింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతిలో ఉన్న కొన్ని కార్యాలయాలను కుర్నూలుకు తరలించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. కానీ, దానిని వ్యతిరేకిస్తూ…కొంతమంది హైకోర్టులో కేసులు ఫైల్ చేశారు. అటు బీజేపీ కూడా కార్యాలయాలు తరలించడానికి వీలులేదని, అమరావతిలోనే కొనసాగాలని, మూడు రాజధానులు తాము వ్యతిరేకం అని చెప్తున్నారు.
అయితే, కేంద్రం మాత్రం రాజధాని విషయం రాష్ట్రాల పరిధిలోనిది అని చెప్పి స్పష్టం చేసింది. ఆ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఎపి బీజేపీ నేతలు మాత్రం రాజధాని ఒక్కటే ఉండాలని అంటున్నారు. ఇక్కడ ఇలా జరుగుతుంటే, బెంగళూరులో మాత్రం మరోవిధంగా జరుగుతున్నది.
బెంగళూరులో కొన్ని కీలకమైన కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. దానికి సంబంధించిన నిర్ణయాన్ని అసెంబ్లీ ఆమోదించడం నుంచి కేంద్ర అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వరకు అన్ని జరిగిపోయాయి. దీంతో బెంగళూరులో ఉన్న కొన్ని కీలక కార్యాలయాలను ఉత్తర కర్ణాటకలోని బెళగావికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఉత్తర కర్ణాటకకు ఉపయోగపడే అనేక కార్యాలయాలను అక్కడికి మారుస్తున్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి బెంగళూరుకు రావాలి అంటే దూరం కాబట్టి కొన్నింటిని అక్కడికి మార్చిడం వలన పరిపాలన సుగమం అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఏపీ జగన్ చేసిన ప్లాన్ ను కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుండటం విశేషం.
841638 4855Glad to be one of numerous visitants on this awing internet site : D. 207071