ప్రభాస్ (Prabhas) హీరోగా ఓం రౌత్ (Om Routh) దర్శకత్వంలో వస్తున్న ‘ఆది పురుష్ (Adipurush)’ ఫైనల్ ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. తిరుపతి వేదికగా జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై ఈ యాక్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు. సీతాపహరణం, జటాయువు వధ సీన్లను అద్భుతంగా చూపించారు. ‘ ‘వస్తున్న రావణ.. న్యాయం రెండు పాదాలతో.. పదితలాల అన్యాయాన్ని అణచివేయడానికి’, ‘ నా ఆగమనం అధర్మ విధ్వంసం’ అని ప్రభాస్ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. లంక మీదకు దండెత్తడానికి వానర మూకను సన్నద్ధం చేసిన సీన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ట్రైలర్ కంటే ఈ ట్రైలర్ లో యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్,సీత పాత్రలో కృతి సనన్ (Krithi Sanon), లంకేశ్వరుడు గా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)నటన ఆద్యంతం ఆకట్టుకుంది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
మరోవైపు తిరుపతి వేదికగా జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇప్పటికే చిన్న జీయర్ స్వామి, ప్రభాస్ హాజరయ్యారు. ఈవెంట్ కి దాదాపు లక్ష మంది హాజరైనట్లు అంచనా. ఇప్పటికే సభ మొత్తం జనాలతో నిండిపోవడంతో.. పాస్ లు ఉన్నవారిని సైతం అనుమతించలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు తిరుపతిలో చిరుజల్లులు కురుస్తున్నాయి.