Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: ఆ 49 మందిలో ‘ఇల్లిటరేట్స్‌’ వున్నారా అద్దేపల్లి శ్రీధర్‌గారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,515FansLike
57,764FollowersFollow

ఒకప్పుడు బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకుని, ఆ తర్వాత జనసేన తరఫున వకాల్తా పుచ్చుకుని, ప్రస్తుతం వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుంటోన్న అద్దేపల్లి శ్రీధర్‌.. ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో ‘ఇల్లిటరేట్స్‌’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

ఇటీవల హైకోర్టు, కొన్ని కీలక తీర్పులు వెల్లడించిన దరిమిలా, వాటిని జీర్ణించుకోలేని వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే, ఆ జుగుప్సాకరమైన వ్యాఖ్యల పట్ల హైకోర్టు సీరియస్‌గా స్పందించినవ విషయం విదితమే. మొత్తం 49 మందికి ఈ మేరకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అందులో వైసీపీ ఎంపీ ఒకరు, వైసీపీకే చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా వున్నారు. కొందరు వైసీపీ సానుభూతిపరులైన సోషల్‌ మీడియా యాక్టివిస్టులూ వున్నారు. ‘నోటీసులు అందుకున్న 49 మందిలో 95 శాతం నుంచి 98 శాతం మంది ఇల్లిటరేట్స్‌.. వాళ్ళకి పద్ధతి తెలియదు.. విషయ పరిజ్ఞానం లేదు..’ అంటూ అద్దేపల్లి శ్రీధర్‌ వ్యాఖ్యానించడం ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

95 శాతం, 98 శాతం అన్నారు గనుక ప్రస్తుత ప్రజా ప్రతినిది¸, మాజీ ప్రజా ప్రతినిది¸ని.. అద్దేపల్లి ఆ 2 శాతం లేదా 5 శాతంలో పడేసి వుండొచ్చుగాక. కానీ, ‘నాకు చట్టం తెలియదు.. తెలియక తప్పు చేసేశాను..’ అంటే కుదరదిక్కడ. రాయడానికి వీల్లేని పదజాలాన్ని సదరు వ్యక్తులు ఉపయోగించడం వల్లనే హైకోర్టు, సుమోటోగా కేసు నమోదు చేసి, విచారణ జరిపి, నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై క్షుణ్ణంగా అధ్యయనం చేయకుండానే అద్దేపల్లి శ్రీధర్‌ మాట్లాడేసి వుంటారని ఎలా అనుకోగలం.? పైగా, డిబేట్లలో మాట్లాడేటప్పుడు అన్నీ ఆలోచించే మాట్లాడతానని చెబుతుంటారాయన. పైగా న్యాయ వ్యవస్థ పట్ల, చట్టాల పట్ల తనకు చాలా అవగాహన వుందని కూడా చెబుతుంటారు.

ఓ ఎంపీ మీద పత్రికల్లో వచ్చిన విషయానికి సంబంధించి ‘పేపకర్‌ కటింగ్‌’ని సోషల్‌ మీడియాలో పెడితే కేసులు నమోదు చేస్తున్నప్పుడు, ఇది ఇంకెంత తీవ్రమైన అంశం.? 66 ఏళ్ళ వృద్ధ మహిళ రంగనాయకమ్మ తెలిసో తెలియకో సోషల్‌ మీడియా పోస్ట్‌ పెట్టిందని సీఐడీ వదిలేయలేదు కదా.!

పదుల సంఖ్య జనసేన పార్టీకి చెందిన, టీడీపీకి చెందిన, ఇతర పార్టీలకు చెందిన నెటిజన్లపై కేసులు పెట్టే క్రమంలో ‘వాళ్ళకు చట్టం తెలియదు.. ఇల్లిటరేట్స్‌..’ అని ప్రభుత్వం ఎందుకు అనుకోవడంలేదన్న చర్చ అద్దేపల్లి శ్రీధర్‌ వ్యాఖ్యల తర్వాత కలగడం సహజమే కదా.! తమవారి పట్ల ఒకలా, తమకి నచ్చనివారి పట్ల ఇంకొకలా ప్రభుత్వం వ్యవహరిస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్ రాజు

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జరగండి..’ పాటను...

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal) అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కాం...

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది. మార్చి 27న మెగా ఫ్యాన్స్ కి...