Switch to English

పృథ్వీ చేసిన కామెంట్ కు సినిమా మొత్తాన్ని బాయ్ కాట్ చేస్తారా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,844FansLike
57,764FollowersFollow

సినిమా నటుడు పృథ్వీ చేసిన ఒక్క కామెంట్ కు లైలా సినిమా మొత్తాన్ని బ్యాన్ చేయాలంటూ వైసీపీ చేస్తున్న రచ్చకు అసలు అర్థం ఉందా అంటున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే ఒక సినిమాను కోట్లు ఖర్చుపెట్టి తీస్తారు. డైరెక్టర్, హీరో నెలల పాటు కష్టపడి తీసిన సినిమాను ఒక్క వ్యక్తి కారణంగా ఎలా బ్యాన్ చేస్తారంటూ సగటు సినిమా ప్రేక్షకులు మండిపడుతున్నారు.

విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ.. మేం షూటింగ్ లొకేషన్ ఓ సీన్ కోసం ఉన్నప్పుడు అక్కడ 150 గొర్రెలు ఉన్నాయి.. తర్వాత చూస్తే అక్కడ 11 ఉన్నాయంటూ వైసీపీ మీద సెటైర్ వేశాడు. అంటే వైసీపీకి గతంలో 155 సీట్లు ఉంటే మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయింది అని వచ్చేలా కామెంట్ చేశాడన్నమాట. అయితే పృథ్వీ ఈ కామెంట్స్ చేయడంతో వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

తమను అవమానించిన లైలా సినిమాను బ్యాన్ చేయాలంటూ వేలాది ట్వీట్స్ వేయిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చ చేస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు.

కాగా ఇదే విషయంపై అటు విశ్వక్ కూడా స్పందించాడు. పృథ్వీ మాట్లాడిన దానికి తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. పృథ్వీ మాట్లాడింది ఆయన వ్యక్తిగతం అని.. దానికి తమ సినిమాను బ్యాన్ చేయడం కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ పృథ్వీ వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణ కూడా చెప్పాడు విశ్వక్ సేన్.

రిలీజ్ రోజే హెచ్ డీ ప్రింట్ ను విడుదల చేస్తామంటూ బెదిరిస్తున్నారని.. అసలు తాను ఎవరికీ అన్యాయం చేయలేదని ఎమోషనల్ అయ్యాడు విశ్వక్. పృథ్వీ చెప్పినట్టు సినిమాలో అన్ని గొర్రెలు లేవని కూడా క్లారిటీ ఇచ్చాడు. అవును విశ్వక్ సేన్ చెప్పింది కరెక్టే కదా అంటున్నారు సగటు నెటిజన్లు.

ఎందుకంటే పృథ్వీ మాట్లాడింది పూర్తిగా అతని వ్యక్తిగతం. కాబట్టి ఏదైనా ఉంటే అతన్ని అనాలి తప్ప.. సినిమాను నిందించడం కరెక్ట్ కాదు. పైగా వైసీపీ వాళ్లు గతంలో ఏ సినిమాను టార్గెట్ చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు.

రామ్ చరణ్​ గేమ్ ఛేంజర్ సినిమా మీద వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎన్ని నెగెటివ్ పోస్టులు పెట్టారో అందరికీ తెలుసని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మరి గేమ్ ఛేంజర్ సినిమా టైమ్ లో వైసీపీని ఏమీ అనలేదు కదా.. అప్పుడెందుకు అలా టార్గెట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వైసీపీ రాజకీయాలు చేయాలి గానీ.. ఇలా సినిమాలను టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

సినిమా

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

రాజకీయం

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

ఎక్కువ చదివినవి

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

ఏపీ బ్రాండ్ తిరిగొచ్చింది.. అశోక్ లే ల్యాండ్ కంపెనీని ప్రారంభించిన లోకేష్

సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ బ్రాండ్ మళ్లీ తిరిగి వచ్చిందన్నారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు నాయుడపై ఉన్న నమ్మకంతోనే ఏపీకి చాలా కంపెనీలు తిరిగి వస్తుననాయన్నారు. విజయవాడ సమీపంలోని మల్లపల్లి...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 20 మార్చి 2025

పంచాంగం తేదీ 20-03-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ షష్ఠి రా. 10.36 వరకు,...

‘నా సూర్యుడివి.. నా చంద్రుడివి’.. తండ్రిపై మనోజ్ ఎమోషనల్ పోస్టు

ఈ నడుమ మంచు ఫ్యామిలీలో వివాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మనోజ్ ఒక్కడు ఒకవైపు ఉంటే మిగతా ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంది. కుటుంబంలో గొడవలు కేసులు పెట్టుకునే...

జస్ట్ ఆస్కింగ్: కడప జిల్లాకి వైఎస్సార్ పేరెందుకు.?

ఇప్పటిదాకా వైఎస్సార్ జిల్లా.! ఇకపై వైఎస్సార్ కడప జిల్లా.! ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ మార్పు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, కడప జిల్లాకి...