Switch to English

మిస్ లీడింగ్ థంబ్ నైల్స్ పై నటి గాయత్రి భార్గవి సీరియస్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,946FansLike
57,764FollowersFollow

వ్యూస్ కోసం కొంతమంది పెట్టే చీప్ థంబ్ నైల్స్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని ఎన్ని విధాలుగా ఛీ కొడుతున్నా సరే వాళ్లు మాత్రం ఆ ధోరణి మార్చుకోవడం లేదు. వాళ్లు చేస్తున్న ఈ పనుల వల్ల ఎంతోమంది ఎన్నో విధాలుగా సఫర్ అవుతున్నారు. తాజాగా తెలుగు నటి గాయత్రి భార్గవికి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఒక మీడియా సంస్థ మీద తన అసంతృప్తిని వెల్లడిస్తూ ఒక స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో పెట్టారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే సదరు సంస్థకు గాయత్రి భార్గవి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఎక్కడ పెద్దగా రివీల్ చేయని గాయత్రి భార్గవి ఆ ఇంటర్వ్యూలో తన భర్త ఆర్మీ ఆఫీసర్ అని.. ఒకసారి తన భర్త ఎదుర్కొన్న కొన్ని సవాళ్ల గురించి.. ఆ టైంలో తన ఫ్యామిలీ పడిన స్ట్రగుల్ గురించి చెప్పుకొచ్చారు.

ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది ఒకటైతే వాళ్లు థంబ్ నైల్ లో మరోటి పెట్టారు. ఏకంగా ఆమె భర్త చనిపోయాడు.. ముక్కలు ముక్కలుగా చేసి అంటూ ఘోరాతి ఘోరంగా రాసుకొచ్చారు. బ్రతికున్న భర్త గురించి మీడియా సంస్థ కేవలం కొన్ని వ్యూస్ కోసం ఇలాంటి నీచానికి దిగడం పట్ల గాయత్రి భార్గవి ఫైర్ అయ్యారు. దేశానికి సేవ చేస్తున్న ఆర్మీ ఆఫీసర్ కి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆమె అన్నారు

సదరు మీడియా సంస్థకు ఇదివరకు ఒకటి రెండు సందర్భాల్లో చెప్పినా సరే సరిచేసుకోలేదని. ఆ మీడియా సంస్థ తనకు వివరణ ఇవ్వాలని గాయత్రి భార్గవి అన్నారు. అంతేకాదు ఆ మీడియా సంస్థ చేసిన పనికి తన భర్త విక్రం కు గాయత్రి భార్గవి క్షమాపణలు చెప్పారు.

మిస్ గైడ్ థంబ్ నైల్స్, లోపల మ్యాటర్ ఒకటైతే పైన థంబ్ నైల్ ఒకటి పెట్టి వ్యూస్ సంపాదించడం మీడియా సంస్థలకు అలవాటుగా మారింది. దీని మీద ఎంతమంది ఎన్ని విధాలుగా ఎటాక్ చేసినా వాళ్ల పద్ధతి మాత్రం మార్పు రావడం లేదు. మరీ గొడవ పెద్దైతే ఆ వీడియో డిలీట్ చేస్తారేమో కానీ అలాంటి థంబ్ నైల్స్ వల్ల ఆ ఫ్యామిలీ పడే మానసిక బాధని ఎవరు గ్రహించలేరు.

మీడియా సంస్థలు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ఇలా మిస్ గైడ్ థంబ్ నైల్స్ పెట్టి ప్రేక్షకులను మోసం చేయడమే కాకుండా వారి వ్యూస్ కోసం సెలబ్రిటీలకు భంగపాటు కలిగేలా చేస్తున్నారు. ఇలాంటివి ఆగాలంటే ముందు ఇలాంటి రాంగ్, మిస్ గైడ్ థంబ్ నైల్ సంస్థలను జనాలు తిప్పికొట్టాలి. వాళ్లపై తగిన విధంగా యాక్షన్ తీసుకోకపోవడం వల్లే ఇలాంటివి మళ్లీ మళ్లీ చేస్తున్నారు.

ఒక ఫ్యామిలీ బాధపడేలా వ్యక్తిగత హననం చేయడం ఎవరికి హక్కు లేదు. కచ్చితంగా దీనిపై సీరియస్ యాక్షన్ ఉంటేనే మళ్లీ మరోసారి ఇలాంటి మిస్ గైడ్ ఇన్ఫర్మేషన్ ని జనాల మీదే రుద్దే ప్రయత్నం చేయరు.

గాయత్రి భార్గవి తీసుకున్న ఈ ఇన్షియేషన్ వల్ల కచ్చితంగా మీడియా సంస్థలు వారి వ్యూస్ కోసం పెడుతున్న మిస్ గైడ్ థంబ్ నైల్స్, అవాస్తవాలను ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది.

సినిమా

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను...

అఖండ 2 రిలీజ్ వాయిదా – కొత్త తేదీ త్వరలో: నిర్మాతల...

అఖండ 2 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాతలు నిన్న రాత్రి లేట్‌గా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. సినిమా విడుదల కోసం టీమ్...

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

రాజకీయం

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

ఎక్కువ చదివినవి

2029 నాటికి ఎపి విద్యలో నెం.1 లక్ష్యం: మంత్రి లోకేష్

పాలకొండలో భామిని ఎపి మోడల్ స్కూలులో జరిగిన మెగా పిటిఎం 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలలపై కొంతమందిలో...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ప్రజల హృదయాలు గెలుచుకునేలా పనిచేయాలి: లోకేష్

తెలుగుదేశం పార్టీ గ్రామ, మండల నాయకులు రాష్ట్రస్థాయి నేతలుగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో జరిగిన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల శిక్షణా తరగతుల...

అఖండ 2 రిలీజ్ వాయిదా – కొత్త తేదీ త్వరలో: నిర్మాతల నుంచి అప్ డేట్

అఖండ 2 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాతలు నిన్న రాత్రి లేట్‌గా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. సినిమా విడుదల కోసం టీమ్ తమ వంతు ప్రయత్నం అంతా చేసినప్పటికీ,...

తెలంగాణలో జనసేన బలోపేతం – ఉత్సాహంగా జనశ్రేణుల సమావేశం

హైదరాబాద్ రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు జరిగిన తెలంగాణ జనశ్రేణుల విస్తృతస్థాయి సమావేశం జనసేన కార్యకర్తలతో సందడి చేసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ వైస్ ప్రెసిడెంట్ బి....