సీనియర్ నటుడు బెనర్జీ అబద్ధం చెప్పే అవకాశం వుంటుందా.? యువ హీరో తనీష్ కూడా అబద్ధం చెప్పాడనే అనుకోవాలా.? మరి, నటుడు ప్రభాకర్ చెప్పినదాన్నీ అబద్ధమనే అనగలమా.? అసలు మోహన్ బాబు రౌడీయిజం చేశారా.? లేదా.? ‘మా’ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జరిగిన రౌడీయిజం గురించి సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోందిప్పుడు.
బెనర్జీని మోహన్ బాబు కొట్టారట.. తనీష్ కూడా తన్నులు తిన్నాడట.. ఈ విషయాన్ని స్వయంగా ప్రకాష్ రాజ్ వెల్లడించారు. మోహన్ బాబు తనను దారుణంగా బూతులు తిట్టారనీ, కొట్టడానికి కూడా వచ్చారనీ బెనర్జీ వాపోయారు. కంటతడిపెట్టారు.. కన్నీరు మున్నీరుగా విలపించారు.. బోరున ఏడ్చినంత పని చేశారు. తనీష్ కూడా ఇదే పరిస్థితి తనకూ ఎదురయ్యిందన్నాడు.
సాధారణ ఎన్నికల్లో ఇలాంటివి చూస్తుంటాం. స్థానిక ఎన్నికల సమయంలో వ్యవహారం హత్యలదాకా వెళుతుంది. అక్కడంటే, దోచుకోవడానికి ప్రజల సొమ్ము.. అదే ప్రభుత్వ ఖజానా వుంటుంది. ‘మా’ ఎన్నికల్లో దోచుకోవడానికి ఏముంటుంది.? ఎందుకు ఎవరైనా రౌడీయిజం చేస్తారు.?
అనసూయ గెలవకపోయినా గెలిచిందనే ప్రకటన ఎందుకు వచ్చిందో.. మేం, ఖచ్చితంగా గెలుస్తున్నామని మంచు విష్ణు మొదటి నుంచీ ‘అతి ’ ధీమా ఎందుకు ప్రదర్శించారో.. ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలేమీ కావు. మొదటి రోజు కౌంటింగ్ తర్వాత బ్యాలెట్ పత్రాలు ఎందుకు బయటకు వెళ్ళాయన్నది మరో ప్రశ్న.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు మీడియా ముందుకొచ్చారు. మోహన్ బాబు, నరేష్ కలిసి నడుపుతోన్న ‘మా’లో తాము ఇమడలేమని చెప్పారు. తమ పదవులకు రాజీనామా చేస్తూ, ‘మా’ సభ్యులుగా మాత్రమే కొనసాగుతామని ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన శ్రీకాంత్, బెనర్జీ, తనీష్, ఉత్తేజ్ తదితరులు చెప్పుకొచ్చారు.
‘మా’ హిస్టరీలోనే ఇదొక కొత్త వింత వ్యవహారం. వీళ్ళంతా రాజీనామా చేసినా, వారి స్థానంలో ఇతరుల్ని నామినేట్ చేసే అవకాశం ‘మా’ అధ్యక్షుడికి వుందట. ‘మేం ప్రశ్నిస్తాం.. అది మీరు తట్టుకోలేరు. అందుకే, గొడవలు జరగకుండా.. ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు అద్భుతంగా పనులు చేయండి, వాటికి మేం అడ్డు పడం.. పదవుల్లో వుండగా ప్రశ్నించడం కష్టం గనుక, 11 మందిగా ప్రశ్నించడం కంటే, వందల మంది సభ్యుల తరఫున ప్రశ్నించాలని నిర్ణయించుకున్నాం..’ అని ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులూ ముక్త కంఠంతో నినదించారు.
23777 870229What a lovely blog page. I will undoubtedly be back once again. Please keep writing! 100685